/rtv/media/post_attachments/wp-content/uploads/2023/06/delhi.jpg)
దేశ రాజధానిలో కాల్పుల ఘటన కలకలం రేపింది. ఆర్కే పురం ప్రాంతంలో ఆదివారం జరిగిన కాల్పులు స్థానికులను భయభ్రాంతులకు గురిచేశాయి. గుర్తు తెలియని దుండగులు ఇద్దరు మహిళలపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక మహిళ అక్కడిక్కడే మరణించగా...మరో మహిళలకు తీవ్రగాయాలయ్యాయి. ఆసుపత్రికి తరలించగా..చికిత్స పొందుతూ మరణించింది. ఈ దారుణ ఘటన ఆర్కే పురం అంబేద్కర్ బస్తీలో చోటుచేసుకుంది. మృతులను పింకీ (30), జ్యోతి (29)గా గుర్తించారు. అయితే వీరిపై దాడికి పాల్పడింది మృతుల సోదరుడేనన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వీరిమధ్య ఆర్థిక లావాదేవీలకు సంబంధించి గొడవలు జరుగుతున్నట్లు స్థానికులు తెలిపారు. పలు సెక్షన్ల కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలింపు చూపట్టారు. గ్యాంబ్లింగ్, బెట్టింగ్ కారణంగానే మహిళలిద్దరూ హత్యకు గురయ్యారని చెబుతున్నారు.
అయితే నిందితుడు కాల్పులు ఎందుకు జరిపారన్న ఆధారాలు మాత్రం స్పష్టంగా తెలియలేదని ఢిల్లీ సౌత్ వెస్ట్ డీసీపీ మనోజ్ సి తెలిపారు. రెండు వర్గాల మధ్య వాగ్వాదం తర్వాతే కాల్పులు జరిగినట్లు చెబుతున్నారు.
Delhi | Two women were shot dead by unidentified assailants in Ambedkar Basti area of RK Puram PS limits, today.
— ANI (@ANI) June 18, 2023
The deceased have been identified as Pinky (30) and Jyoti (29). The assailants came for the victim's brother primarily. Prima facie seems to be a money settlement… pic.twitter.com/D8FkYiHQwp