తమిళనాడులో పోలీసుల ఎన్కౌంటర్.. ఇద్దరు రౌడీ షీటర్లు మృతి తమిళనాడులో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గూడువంచెరి మండలం తాంబరం పరిధిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. By BalaMurali Krishna 01 Aug 2023 in క్రైం నేషనల్ New Update షేర్ చేయండి తమిళనాడులో ఎన్కౌంటర్ జరిగింది. మంగళవారం తెల్లవారుజామున గూడువంచెరి మండలం తాంబరం పరిధిలో జరిగిన పోలీసుల కాల్పుల్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. మృతులను చోటా వినోద్(36), రమేష్ (32)గా గుర్తించారు. వినోద్పై 10 హత్య కేసులు సహా కనీసం 50 కేసులు ఉండగా, రమేష్పై 7 హత్య కేసులు సహా 20 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. మంగళవారం తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో గూడువంచెరి వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా పోలీసులపై ఇద్దరు దాడికి యత్నించగా ఎదురుకాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మరణించారు. ఈ ఘటన జరిగినప్పుడు నలుగురు వ్యక్తులు కారులో ప్రయాణిస్తున్నట్లు వెల్లడించారు. మరో ఇద్దరు కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గతేడాది జనవరిలో కూడా చెంగల్పట్టు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో ఇద్దరు రౌడీ షీటర్లు మరణించారు. మృతులు మొయిద్దీన్, దినేష్ ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్నారు. హత్య జరిగిన 12 గంటల్లోపే పోలీసులు నిందితులను మట్టుబెట్టారు. అప్పట్లో ఈ ఎన్కౌంటర్ తమిళనాడు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి