అమెరికాలోని న్యూయార్క్ నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బస్సులు ఢీకొన్న ప్రమాదంలో 80 మంది గాయపడ్డారు. వారిలో 18 మందికి తీవ్రంగా గాయపడ్డారు. డబుల్ డెక్కర్ టూర్ బస్సు వెనుక నుండి ప్రయాణీకుల బస్సును ఢీకొట్టింది. దీనితో అనేక మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రిలో చేర్పించారు.
బస్సు వేగంగా ఢీకొనడంతో బస్సు పూర్తిగా ధ్వంసం అయ్యింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం, మాన్హట్టన్లో ప్రమాదం జరిగిన తర్వాత గాయపడిన వారిని బస్సులో నుండి బయటకు తీశారు. డబుల్ డెక్కర్ టూర్ బస్సుకూడా డ్యామేజ్ అయ్యింది.
న్యూయార్క్ ఫైర్ డిపార్ట్మెంట్ ప్రకారం, రెండు బస్సులు ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అయినట్లు తెలిపింది. బస్సులో ఉన్న మరో 63 మందిని వైద్య సిబ్బంది సురక్షితంగా బయటకు తీశారని డిపార్ట్మెంట్ తెలిపింది. ప్రయాణికుల్లో చాలా మందికి తీవ్ర గాయాలైనట్లు తెలిపారు. వారిలో 18మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కొందరికి ఎముకలు విరగడంతోపాటు తల, మెడపై గాయాలైనట్లు అధికారులు చెప్పారు.