Razakars: నేడు రజాకార్ల రాజ్యం నడుస్తోంది.. టీడీపీ ఫైర్!

నేడు తెలుగు రాష్ట్రాల్లో నిరంకుశ పాలన చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని టీడీపీ విమర్శిస్తోంది. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, గాంధీ మార్గాన్ని అనుసరించి గ్రామ స్వరాజ స్థాపనకు శ్రీకారం చుట్టారని నాటి సీఎం ఎన్టీఆర్‌ని తెలంగాణ టీడీపీ నేతలు సెప్టెంబర్‌ 17 సందర్భంగా గుర్తు చేసుకున్నారు. సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందని సామా భూపాల్‌ రెడ్డి చెప్పారు.

New Update
Razakars:  నేడు రజాకార్ల రాజ్యం నడుస్తోంది.. టీడీపీ ఫైర్!

రజాకార్ల నీచ నీకృష్ట పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందని.. ఎందరో మంది బిడ్డలు, బలిదానాలకు గురైయ్యారని, తెలంగాణ తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సామా భూపాల్ రెడ్డి అన్నారు. సెప్టెంబర్ 17 తెలంగాణ విలీన దినోత్సవం సందర్భంగా.. టీటీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు సామా భూపాల్ రెడ్డి హైదరాబాద్‌లోని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సామ భూపాల్ రెడ్డి మాట్లాడుతూ.. నాడు రజాకార్లు మత పిచ్చితో బానిసత్వంలో ఉన్న వారిపై పైశాచిక ఆనందం పొందుతూ పాలన చేస్తున్న వారికి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఎందరో తెలంగాణ మహాను భావులను పొట్టన పెట్టుకున్న మూర్ఖుడు ఖాసిం రజ్వీ అన్నారు.

సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిన నల్లగొండ, వరంగల్ జిల్లాల్లో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మొక్కవోని దీక్షతో సాయుధ పోరాటం జరిగిందని గుర్తు చేశారు సామా భూపాల్‌ రెడ్డి. 'వ్యవసాయం చేసే అక్కలు కొడవల్లు పట్టిరు. దుక్కి దున్నే నాగళ్లతో పొలం పనులు చేసే రైతన్నలు చేతుల్లో తుపాకులు పట్టిర్రు, భగత్ సింగ్ లాంటి వారిని ఆదర్శగా తీసుకొని, తెలంగాణ సాయుధ పోరాటంలో పాల్గొన్న ప్రజలు తెలంగాణ ప్రాంతాన్ని విముక్తి చేశారు' అని అన్నారు.

ఎన్టీఆర్‌ వచ్చింది అందుకే:
తెలంగాణ విముక్తి అయింది కానీ పేద ప్రజలు, పల్లెలు విముక్తి కాలేదన్నారు సామా భూపాల్‌రెడ్డి. కానీ నాడు పటెల్, పట్వారీలు బడుగువర్గాలను నిరక్షరాస్యులుగా నిరుపేదలను చేసి పాలన చేస్తున్న పాలన సాగించే వారని ఆరోపించారు. ఆ బానిసత్వం నుంచి విముక్తి చేయడం కోసం అనాడు నందమూరి తారక రామారావు తెలుగుదేశం పార్టీ స్థాపించారని భూపాల్ రెడ్డి పేర్కొన్నారు. పటేల్ పట్వారీ వ్యవస్థను రద్దుచేసి, గాంధీ మార్గాన్ని అనుసరించి గ్రామ స్వరాజ స్థాపనకు శ్రీకారం చుట్టారని చెప్పారు. ఎంతో మంది బడుగులకు రాజకీయ అవకాశాలు ఇచ్చి చైన్యవంతులుగా చేశారని తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి, మాహా నాయకుడు, తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు మన పిల్లల ఎదుగుదల కోసం ఆర్థికంగా ఎదగడం కోసమని.. యావత్ ప్రపంచం మెచ్చేలా తీర్చిదిద్దారని చెప్పారు. అదే మాహనాయకుని లక్ష్యమన్నారు. అదే విధంగా టీడీపి హయాంలో హైటెక్ సిటీ నిర్మించి లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఐటీ రంగంలో ఉన్నత ఉన్నత స్థానాలకు ఎదిగేందుకు కృషి చేశారని తెలిపారు.

తెలుగుదేశం నాయకులు అశోక్ గౌడ్ ఏం అన్నారంటే?
నేడు తెలుగు రాష్ట్రాల్లో నిరంకుశ పాలన చేస్తూ అధికారాన్ని అడ్డం పెట్టుకొని పాలన చేస్తున్నారని అశోక్ గౌడ్ విమర్శించారు. తెలుగుదేశం పార్టీ పై దిగజారుడు మాటలు మాట్లాడుతూ పాలన చేస్తున్నారని విమర్శించారు. నాడు సంతోషంగా ఉన్న బడుగు వర్గాల పరిస్థితి, నేడు రజాకార్ల రాజ్యం తలపిస్తోందన్నారు. అందుకే నేటి కార్యక్రమం అతి ముఖ్యమైనదన్నారు. రెండు తెలుగు రాష్ట్రల్లో అధికారం వచ్చేందుకు పార్టీ నాయకులు కార్యకర్తలు పనిచేయాలన్నారు.

ALSO READ: రంగా లక్ష్యలను, ఆశయాలను తాకట్టు పెట్టారు.. పవన్‌కి వ్యతిరేకంగా విజయవాడలో మీటింగ్‌!

Advertisment
తాజా కథనాలు