TSRTC Announced 8th DA: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తన ఉద్యోగులకు శుభవార్త చెప్పింది. ఉద్యోగులకు మరో డీఏ ప్రకటించింది. పెంచిన డీఏ ని సెప్టెంబర్ నెల జీతంతో కలిపి చెల్లించనున్నట్లు ప్రకటించింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.. ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(DA) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(TSRTC) నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది. ‘పెండింగ్లో ఉన్న 8వ డీఏను ఉద్యోగులకు మంజూరు చేయాలని టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయించింది. క్లిష్ట పరిస్థితుల్లోనూ ఇప్పటివరకు 8 డీఏలను సంస్థ మంజూరు చేసింది. ఆర్టీసీ ఉద్యోగులు బాగా కష్టపడి పనిచేస్తున్నారు. పెండింగ్ బకాయిలను త్వరలోనే ఇవ్వడానికి యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.’ అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. కాగా, టీఎస్ఆర్టీసీ యాజమాన్యం నిర్ణయం పట్ల ఉద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అంతకుముందు రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా ఉద్యోగులకు 7వ డీఏను ప్రకటించింది ఆర్టీసీ యాజమాన్యం. 2022 జులైకి సంబంధించిన 4.9 శాతం డీఏని ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ డీఏను గత జూన్ నెల జీతంతో కలిపి ఇచ్చారు. ఇప్పుడు మరో డీఏని ప్రకటించడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..TSRTC: టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. మరో డీఏ ప్రకటించిన ఆర్టీసీ యాజమాన్యం..
తమ ఉద్యోగులకు మరో విడత కరువు భత్యం(డీఏ) ఇవ్వాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇవ్వాల్సి ఉన్న 5 శాతం డీఏను సిబ్బందికి మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ సెప్టెంబర్ నెల వేతనంతో కలిపి డీఏను ఉద్యోగులకు చెల్లించనుంది.
Translate this News: