తెలంగాణ బీజేపీ ఇంట్లో ఏ నలుగురి మధ్య సఖ్యత ఉన్నట్టే కనిపించడంలేదు. ఎప్పుడూ చూసిన అలకలు, ఏడుపులు, పెడార్థలే కనిపిస్తున్నాయి. తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్నా ఇప్పటివరకు ఒకే తాటిపైకి రాలేదు సీనియర్లు. బండి సంజయ్, కిషన్రెడ్డి వర్గాల లొల్లి సమిసిపోయిందని అలా అనుకున్నారో లేదో మరో సమస్య ఇలా దర్శనమిస్తోంది. తాజాగా తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడినట్టు కనిపిస్తున్నాయి. ఈసారి తెలంగాణ లీడర్ల అలక కిషన్రెడ్డిపైనో.. బండి సంజయ్పైనో కాదు.. ఏకంగా కేంద్ర హోంమంత్రి అమిత్షాపైనా. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్షాపై పలువురు బీజేపీ నేతలు అలిగారు.
పూర్తిగా చదవండి..BJP Politics: బీజేపీలో అసంతృప్తి జ్వాల.. అమిత్షాపై అలిగిన నేతలు.. ఎవరంటే?
తెలంగాణ బీజేపీలో అసంతృప్తి జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్షాపై పలువురు కీలక బీజేపీ నేతలు అలిగారు. రాష్ట్ర విమోచన దినోత్సవ సందర్భంగా హైదరాబాద్కు వచ్చిన అమిత్షాపై కేవలం కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటలను కలవడంపై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నేతలు. ఈ లిస్ట్లో మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి, విజయశాంతి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా ఉన్నారు.
Translate this News: