బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డికి మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఇటీవల కాంగ్రెస్ లో ఐదుగురు షిండేలు ఉన్నారు.. రేవంత్ ప్రభుత్వం ఎప్పుడైనా కూలిపోవచ్చని బీజేపీ ఎమ్మెల్యే మహేశ్వర్రెడ్డి వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మహేశ్వర్రెడ్డికి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. ఇంకోసారి తన పేరు తీస్తే బాగుండదని హెచ్చరించారు.
కాంగ్రెస్లో పార్టీలో ఎలాంటి గ్రూపులు లేవన్నారు. మరో పదేళ్లు రేవంతే సీఎం అని అన్నారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను తామెప్పుడూ అవమానించలేదన్నారు కోమటిరెడ్డి. తమ పార్టీ అంతర్గత విషయాలపై మాట్లాడొద్దని ప్రతిపక్ష నేతలను హెచ్చరించారు. బీఆర్ఎస్ నేత హరీశ్రావు, మహేశ్వర్రెడ్డికు ఇదే తన చివరి వార్నింగ్ అంటూ ఫైర్ అయ్యారు కోమటిరెడ్డి.