తనకు సంబంధించిన ఆస్తులను నిజ విలువ కంటే అధికంగా చూపి బ్యాంకులు, బీమా సంస్థలను మోసం చేసి వ్యాపార రుణాలు, బీమా పొందారన్న అభియోగాలను ట్రంప్ ఎదుర్కొంటున్నారు. ఈ అభియోగాలపై కేసు నమోదైంది. న్యూయార్క్ అటార్నీ జనరల్, డెమోక్రాట్ నేత లెటిటియా జేమ్స్ ఈ దావా వేశారు. దీనిపై రెండున్నర నెలల పాటు విచారణ జరిపిన న్యాయస్థానం గత ఫిబ్రవరిలో ఆయనకు 454 మిలియన్ డాలర్ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది. దీనిపై అప్పీల్కు వెళ్తామని జరిమానాను రద్దు చేయాలని ట్రంప్ న్యాయవాదుల బృందం కోర్టును కోరింది. అప్పటి వరకు ఆస్తుల జప్తు వంటి కఠిన చర్యలు తీసుకోకుండా ఆదేశాలు జారీ చేయాలని విజ్ఞప్తి చేసింది. దీంతో కోర్టు హామీ కింద 175 మిలియన్ డాలర్లు కోర్టులో సమర్పించాలని ఆదేశించింది.
పూర్తిగా చదవండి..Trump:కోర్టుకు రూ.1460 కోట్ల బాండు సమర్పించిన ట్రంప్!
బ్యాంకులను మోసం చేశారన్న కేసులో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తాజాగా కోర్టులో 175 బిలియన్ డాలర్లు (రూ.1460 కోట్ల) బాండు సమర్పించారు. తద్వారా తనకు విధించిన 454 మిలియన్ డాలర్ల జరిమానా విషయంలో కోర్టు తదుపరి చర్యలు తీసుకోకుండా ఉండేందుకు బాండు సమర్పించారు.
Translate this News: