CM KCR: సీఎం కేసీఆర్ భారీ ట్విస్ట్.. వారికి టికెట్ కట్?

ఈ రోజు కేవలం 51 మంది అభ్యర్థులకు మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు. మిగతా అభ్యర్థులకు రెండు రోజుల్లో అదిస్తామన్నారు. ఈ నేపథ్యంలో బీఫామ్ చేతికి రాని అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది.

CM KCR: సీఎం కేసీఆర్ భారీ ట్విస్ట్.. వారికి టికెట్ కట్?
New Update

తెలంగాణ భవన్ లో సీఎం కేసీఆర్ (CM KCR) బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులకు బీఫామ్ లను అందజేస్తున్నారు. అయితే.. మొత్తం 119 స్థానాలకు గానూ.. ఈ రోజు కేవలం 51 మందికి మాత్రమే బీఫామ్ లను అందించనున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. నిన్న మంచి రోజు కాకపోవడంతోనే బీఫామ్ లను సిద్ధం చేయలేకపోయినట్లు చెప్పారు. ఒకటి, లేదా రెండు రోజుల్లో మిగతా వారికి కూడా బీఫామ్ లు అందించనున్నట్లు వెల్లడించారు. అయితే.. ఈ రోజు బీఫామ్ అందుకోవడం కోసం ఎంతో ఆశగా తెలంగాణ భవన్ కు వచ్చిన మిగతా అభ్యర్థులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ముందుగా ప్రకటించిన 115 స్థానాల్లో కనీసం ఐదు నుంచి పది మంది వరకు అభ్యర్థులను మార్చే ప్రచారం ఇప్పటికే సాగుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు బీఫామ్ అందుకోని వారిలో ఆందోళన వ్యక్తం అవుతోంది. తమకు ఏమైనా టికెట్ రద్దు చేస్తారా? అన్న టెన్షన్ ఆయా అభ్యర్థుల్లో కనిపిస్తోంది.

ఇది కూడా చదవండి: CM KCR Live: మళ్లీ అధికారం మనదే.. ఆ విషయంలో అలర్ట్ గా ఉండండి: అభ్యర్థులతో కేసీఆర్

ఇదిలా ఉంటే.. 51 మంది అభ్యర్థుల బీఫామ్ లను సీఎం కేసీఆర్ అందించారు. బీ ఫామ్ లతో పాటు ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్ ను సైతం కేసీఆర్ ఆయా అభ్యర్థులకు అందించారు. అయితే.. కామారెడ్డిలో పోటీ చేయనున్న సీఎం కేసీఆర్ కు సంబంధించిన బీఫామ్ ను ప్రస్తుత సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్దన్ అందుకున్నారు.

మంత్రి ప్రశాంత్ రెడ్డి తల్లి ఇటీవల మరణించడంతో ఆయన ఈ రోజు తెలంగాణ భవన్ లో జరుగుతున్న మీటింగ్ కు హాజరు కాలేదు. దీంతో ఆయన బీఫామ్ ను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అందుకున్నారు. ప్రస్తుతం బీఫామ్ ల పంపిణీ పూర్తి కావడంతో మేనిఫెస్టో ను ప్రకటించనున్నారు కేసీఆర్. ప్రెస్ మీట్ లో కేసీఆర్ స్వయంగా మేనిఫెస్టోను ప్రకటించనున్నారు.

#telangana-elections-2023 #telangana-politcs #cm-kcr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe