AP CS: సీఎస్ సీరియస్.. ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు.. ఆయా స్ధానాల్లో ఎవరెవరు ఉన్నారంటే?

ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఈ మేరకు ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ వేటుకు గురైన డిప్యూటీ కలెక్టర్ల స్ధానంలో వేరే వారిని నియమించారు. పూర్తి సమాచారం కోసం ఆర్టికల్ లోకి వెళ్లండి..

New Update
AP CS: సీఎస్ సీరియస్.. ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు.. ఆయా స్ధానాల్లో ఎవరెవరు ఉన్నారంటే?

AP CS: ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు ముగ్గురు డిప్యూటీ కలెక్టర్లపై బదిలీ వేటు పడింది. ఒంగోలు పార్లమెంటు, ఎర్రగొండపాలెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో పి.శ్రీలేఖ, డిప్యూటీ కలెక్టర్ కర్నూల్ ఏ మురళి, డిప్యూటీ కలెక్టర్ అనంతపూర్ ఓ రాంభూపాల్ రెడ్డి లపై బదిలీ వేటు పడింది.

Also Read: నేను చనిపోతే.. దయచేసి ఇలా ఎవరూ చేయవద్దు.. కేజ్రీవాల్‌ ఎమోషనల్ కామెంట్స్.!

ఈ ముగ్గురు అధికారులు సాధారణ పరిపాలన శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ వద్ద కు తదుపరి ఉత్తర్వుల కోసం రిపోర్ట్ చేయాలని ఏపీ సీఎస్ కెఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో బదిలీ వేటుకు గురయిన డిప్యూటీ కలెక్టర్ ల స్ధానంలో వేరే వారిని నియమిస్తూ సీఎస్ కే ఎస్ జవహర్ రెడ్డి ఉత్తర్వులు ఇచ్చారు. వీరు ఆయా స్ధానాల్లో ఆర్వోలుగా ఎంసిసి పూర్తయ్యే వరకూ వ్యవహరించనున్నట్టు సమాచారం.

publive-image

ఎం వెంకట సత్యనారాయణను మార్కాపూర్ ఆర్ అండ్ ఆర్ యూనిట్ కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు. సి విశ్వనాధ్ ను కర్నూల్ హెచ్ఎన్ఎస్ఎస్ యూనిట్ త్రీకి స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా.. జే శిరీషను అనంతపురం పిఏబిఆర్ 2కు స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ గా బదిలీ చేశారు.

Advertisment
తాజా కథనాలు