AP Train Accident: ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..

ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ట్రైన్‌ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

AP Train Accident: ఏపీలో పట్టాలు తప్పిన ప్యాసింజర్ రైలు..
New Update

AP Train Accident: ఏపీలో పెను ప్రమాదం తప్పింది. రాయగడ ప్యాసింజర్ రైలు పట్టాలు తప్పింది. విజయనగరం జిల్లా కొత్తవలసలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో రైలు ఇంజిన్‌ ఒకవైపుకి ఒరిగిపోయింది. విశాఖపట్నం నుంచి భవానీపట్నం వెళ్తోంది ఈ ట్రైన్‌. ఈ ప్రమాదంలో పలువురికి గాయాలు అయ్యాయి. గాయాలైనవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాణనష్టం జరగకపోవడంతో రైల్వే శాఖ ఊపిరి పీల్చుకుంది. విశాఖ నుంచి సాయంత్రం 6 గంటలకు బయల్దేరిన ట్రైన్.. రాత్రి 7గంటలకు కొత్తవలస రైల్వే స్టేషన్ వద్దకు చేరుకోగానే ప్రమాదం జరిగింది. లోకో పైలట్‌ అప్రమత్తతతో పెను ప్రమాదం తప్పింది. ట్రైన్‌ ఒక్కసారిగా పక్కకు ఒరగడంతో భయంతో ప్రయాణికులు పరుగులు తీశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

#ap-latest-news #ap-train-accident #train-accident-in-india #vijayanagaram-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe