Revanth Reddy: కాంగ్రెస్ గెలిస్తే అసలైన 24 గంటల కరెంట్.. ధరణిని మించిన యాప్‌: రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ 24 గంటల కరెంట్ అబద్ధమని రేవంత్ రెడ్డి ఆరోపించారు. తాము అధికారంలోకి వస్తే 24 గంటల నాణ్యమైన కరెంట్ వ్యవసాయానికి అందిస్తామన్నారు. ధరణిని మించిన యాప్ తీసుకువస్తామన్నారు. ఈ రోజు పలు నియోజకవర్గాల్లో ఆయన ప్రచారం నిర్వహించారు.

TS 2nd CM Revanth Reddy: తెలంగాణ రెండో సీఎంగా రేవంత్ రెడ్డి.. ఆయన ఫుల్ ప్రొఫైల్ ఇదే!
New Update

తెలంగాణలో కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్​ రెడ్డి (Revanth Reddy) హామీ ఇచ్చారు. అలాగే బోయలను ఎస్టీ జాబితాలో చేర్చుతామని, దీంతో పాటు బోయలకు ఎమ్మెల్సీ ఇస్తామని తెలిపారు. మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లాలో అలంపూర్​లో శక్తిపీఠాన్ని దర్శించుకున్న అనంతరం బహిరంగ సభలో రేవంత్‌ మాట్లాడారు. ఆర్డీఎస్‌ సమస్య పరిష్కరించే బాధ్యత తానే స్వయంగా తీసుకుంటానన్నారు. కేటీఆర్‌, హరీశ్‌రావు రాష్ట్రంలో కాంగ్రెస్​ ఓడించేందుకు కుట్ర చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్ట్ర ఆత్మగౌరవంపై దాడి చేస్తున్నారని విమర్శించారు. తాను 3 గంటలు మాత్రమే కరెంట్​ ఇస్తానని అన్న మాటలు నిరూపించాలని సీఎం కేసీఆర్​కు సవాలు విసిరారు. బీఆర్ఎస్​ 24 గంటలు కరెంట్​ ఇస్తున్నట్లు నిరూపిస్తే తమ నామినేషన్లు ఉపసంహరించుకుంటామని, 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని తాము నిరూపిస్తే కేసీఆర్‌ ముక్కు నేలకు రాస్తారా? అని సవాల్‌ చేశారు.

ఇది కూడా చదవండి: Telangana: ప్రజలు సంతలో గొర్రెలు కాదు.. కేసీఆర్‌పై సంచలన కామెంట్స్ చేసిన పొంగులేటి..

రాష్ట్రంలో ధరణి రాకముందే.. రైతు బంధు వచ్చిందని, 2006-07లోనే వైఎస్‌ రుణమాఫీ చేశారని గుర్తు చేశారు. ధరణి లేకుండానే రుణమాఫీ జరిగిందని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం రైతుబంధు అమలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ధరణి లేకముందే ఎరువుల సబ్సిడీ.. రైతులకు వ్యవసాయ పనిముట్లు కూడా ఇచ్చారని స్పష్టం చేశారు. బీఆర్​ఎస్​ నాయకులకు ధరణి ఏటీఎంలా మారిందని ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్ సహా ఆ కుటుంబమంతా దళారులే అని ఆరోపించారు. ధరణి స్థానంలో మరింత అత్యున్నత ప్రమాణాలతో యాప్ తీసుకు వస్తామన్నారు. ధరణి రద్దు చేస్తే రైతుబంధు ఎందుకు రాదు? అని ప్రశ్నించారు. డబుల్ బెడ్రూం ఇళ్లు ఏ పేదవాడికి వచ్చాయో చూద్దామా? అని నిలదీశారు. ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చిన చోట కాంగ్రెస్ ఓట్లు అడుగుతుంది... డబుల్ బెడ్రూం ఇచ్చినచోట మీరు అడిగేందుకు సిద్ధమా? అని ప్రశ్నించారు.

రూ.500కే సిలిండర్‌, కౌలు రైతులకు రూ.16 వేలు

కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చాక రూ.500కే సిలిండర్‌ ఇస్తామని రేవంత్‌రెడ్డి అన్నారు. గద్వాలలో జరిగిన ప్రజా గర్జన సభలో ఆయన మాట్లాడుతూ... రైతు భరోసా ద్వారా రైతులకే కాకుండా కౌలు రైతులకు కూడా రూ.16 వేలు ఇస్తామన్నారు. ఉపాధి హామీ కూలీలకు రూ.12 వేలు ఇస్తామని.. పేదలకు ఉచిత విద్యుత్‌ అందిస్తామని పేర్కొన్నారు. జన ప్రవాహాన్ని చూస్తుంటే గద్వాలలో కాంగ్రెస్ జెండా ఎగురేయడం ఖాయమని నిర్ధారణ అయిపోయిందని పేర్కొన్నారు. 'కాంగ్రెస్‌ గతంలో ఎన్నో ప్రాజెక్టులు నిర్మించింది. కాంగ్రెస్‌ కట్టిన ఏ ప్రాజెక్టుకైనా ఇబ్బందులు వచ్చాయా?. గతంలో పాలమూరు జిల్లాను కాంగ్రెస్‌ ఆదుకుంది. బీమా, నెట్టెంపాడు ప్రాజెక్టును కాంగ్రెస్‌ కట్టింది. 24 గంటల కరెంట్‌ ఇచ్చామని నిరూపిస్తే మేం నామినేషన్లే వేయం. 24 గంటల కరెంట్‌ ఇవ్వట్లేదని నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తారా. తెలంగాణ రైతాంగానికి ఉచిత విద్యుత్‌ ఇచ్చిందే కాంగ్రెస్ పార్టీ. కేసీఆర్‌ కోటి ఎకరాలకు నీరిస్తే.. 7 లక్షల పంపు సెట్లు ఎందుకు పెరిగాయి. కాంగ్రెస్‌ రైతు డిక్లరేషన్‌ చూసి బీఆర్‌ఎస్ బెంబేలెత్తిపోతోంది. గద్వాలలో కాంగ్రెస్ అభ్యర్థి సరితను గెలిపించాలి.' అని రేవంత్‌రెడ్డి కోరారు.ఫ

#telangana-elections-2023 #revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe