Minister Lokesh: ప్రజలను చంపాలని జగన్ కుట్ర.. లోకేష్ సంచలన ట్వీట్

జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేశారని లోకేష్ సంచలన ఆరోపణలు చేశారు. ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టి దానిని కూల్చాలని కుట్రపన్నాడన్నారు.

LOKESH
New Update

Minister Lokesh: మాజీ సీఎం జగన్ పై విమర్శల దాడికి దిగారు మంత్రి లోకేష్. అధికారం అండ‌గా సైకో జ‌గ‌న్ త‌న ఇసుక మాఫియా కోసం అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయేలా చేసి 50 మందిని చంపేసి, 5 ఊర్లు నామరూపాలు లేకుండా చేశారని ధ్వజమెత్తారు. ఇదే ప్లాన్ ప్ర‌కారం ఇనుప పడవలతో ప్రకాశం బ్యారేజి ఢీకొని కూల్చేసి, విజయవాడతో పాటు పదుల సంఖ్యలో లంక గ్రామాలు నామ రూపాలు లేకుండా చేయాలని చూశారని అన్నారు.

కుట్ర..

లక్షలాది మంది ప్రజలు జల సమాధి అయ్యేలా సైకో జ‌గ‌న్ ప‌న్నిన కుట్ర బ‌ట్ట‌బ‌య‌లైందని అన్నారు. ప్ర‌కాశం బ్యారేజీని పడవలతో కూల్చేయాల‌నే కుట్ర ప్లాన్ చేసింది సైకో జగన్ అయితే, ప్లాన్ అమలు చేసింది వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్ అని ఆరోపించారు. తమ కుట్రలు బయటపడకుండా వరద ముంపునకు ప్రభుత్వమే కారణమంటూ విషప్రచారం చేస్తుంది సైకో జగన్ ముఠా అని ఫైర్ అయ్యారు.

Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe