జనసేన నాయకులకు పోలీసులకు కొంత తోపులాట జరిగింది. జనసేన కార్యకర్తలకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న జనసేన నాయకులను పోలీసులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించారు. జనసేన పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ కోట వినుతను టూ టౌన్ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కాళహస్తిలో ప్రస్తుతం కొంత ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
పూర్తిగా చదవండి..చెంప పగలగొట్టిన సీఐ అంజుయాదవ్, మండిపడుతున్న నాయకులు
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని పెళ్లి మండపం వద్ద ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దగ్ధం చేసేందుకు జనసేన పార్టీ శ్రేణులు సిద్ధపడగా జనసేన నాయకుల నుంచి దిష్టి బొమ్మను పోలీసులు లాక్కునే ప్రయత్నం చేసారు. దీంతో డౌన్ డౌన్.. సీఎం అంటూ నినాదాలు చేశారు. పోలీసులు జనసేన నాయకుల మధ్య తీవ్ర ఉద్రికత నెలకొంది. అయితే రంగంలోకి దిగిన సీఐ అంజుయాదవ్ మరోసారి చెంప చెల్లుమనిపించారు. ప్రస్తుతం ఇదే హాట్ టాఫిక్గా మారింది.
Translate this News: