Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్ కౌంటర్! శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు. By Bhavana 28 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Tirumala Darshan Tickets: తిరుమల తిరుపతి శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించేందుకు ప్రపంచం నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు తరలి వస్తుంటారు. చాలా మంది కాలి నడక ద్వారా స్వామి వారి కొండలు ఎక్కి తమ మొక్కులు, ముడుపులను చెల్లించుకుంటారు. ఈ క్రమంలోనే శ్రీవాణి ట్రస్టు భక్తుల సౌకర్యార్థం.. టికెట్ల జారీ విషయంలో టీటీడీ ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి శ్రీవాణి ట్రస్ట్ భక్తులకు మరింత సౌకర్యంగా టికెట్లు జారీ చేసేందుకు.. ఆదిశేషు విశ్రాంతి గృహంలో తాత్కాలిక కేంద్రం ఏర్పాటు చేయాలని టీటీడీ ఈవో జె.శ్యామలరావు అధికారులను ఆదేశించారు. స్థానిక గోకులం విశ్రాంతి భవనంలోని టికెట్ల జారీని ఈవో శుక్రవారం పరిశీలించారు. అక్కడ వసతులు లేకపోవడాన్ని ఆయన గమనించారు. దాని బదులు డీఎఫ్వో ఆఫీసులో శాశ్వత ప్రాతిపదికన టికెట్ల జారీ కౌంటర్లు, 200 మంది భక్తులు వేచి ఉండేందుకు వీలుగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ అధికారులకు ఈవో ఆదేశాలు జారీ చేశారు. Also Read: విమానాల్లో ఫ్రీ వైఫై..ఏ ఎయిర్ లైన్స్ లోనో తెలుసా! #tirumalatirupati #tickets #eo #ttd మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి