CM KCR Vs Thummala: నిన్న సీఎం కేసీఆర్ పాలేరులో పర్యటించిన తర్వాత ఖమ్మం జిల్లా రాజకీయాలు మరింత వేడెక్కాయి. ఓడిపోయి ఇంట్లో కూర్చున్న తుమ్మల నాగేశ్వరరావును పిలిచి మంత్రి పదవి ఇస్తే ఆయన బీఆర్ఎస్ పార్టీకి (BRS Party) చేసింది సున్నా అంటూ కేసీఆర్ (CM KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. తుమ్మల (Thummala Nageshwara Rao) కూడా ఇంతే ఘాటుగా రిప్లై ఇచ్చారు. తాను పార్టీలో చేరినప్పుడు జిల్లాలో టీఆర్ఎస్ నుంచి గెలిచిన ఒక్క ఎంపీటీసీ సభ్యుడు కూడా లేరన్నారు. అలాంటి పరిస్థితుల్లో బాలసాని లక్ష్మీనారాయణను స్థానిక సంస్థల నుంచి ఎమ్మెల్సీగా గెలిపించామని గుర్తు చేశారు. ఆ సమయంలో ఖమ్మం కార్పోరేషన్ పై కూడా గులాబీ జెండా ఎగురవేయడానికి ప్రజలకు తనపై ఉన్న విశ్వాసమే కారణమన్నారు. తాను ప్రజల కోసం పార్టీ మారాను తప్పా.. పదవుల కోసం కాదన్నారు. పదవులన్నీ తన దగ్గరకు వెతుక్కుంటూ వచ్చాయన్నారు.
ఇది కూడా చదవండి: Khammam Politics: ఆందోళనలో పొంగులేటి.. చుక్కలు చూపిస్తున్న హైకమాండ్.. అసలేం జరుగుతోంది?
CM KCR Vs Thummala: ఈ లెక్కలే నిజం చెప్తాయి.. కేసీఆర్ కు తుమ్మల కౌంటర్.. సోషల్ మీడియాకు చేరిన వార్
ఊహించినట్లుగానే సీఎం కేసీఆర్ నిన్న పాలేరు పర్యటనలో తుమ్మలను టార్గెట్ చేశారు. ఓడి పోయిన తుమ్మల నాగేశ్వరరావును తీసుకువచ్చి మంత్రి పదవి ఇస్తే ఆయన చేసింది సున్నా అంటూ ఫైర్ అయ్యారు. 1995లోనే కేసీఆర్ కు తాను మంత్రి పదవి ఇప్పించానని.. ఇప్పుడు ఆయన నాకు ఇచ్చేది ఏంటని ఘాటు రిప్లై ఇచ్చారు తుమ్మల. ఇందుకు సంబంధించి ఇరు పార్టీల నేతలు సోషల్ మీడియాలోనూ కామెంట్లు చేసుకుంటున్నారు.
Translate this News: