CRIME: బాత్రూంలో మూడేళ్ల బాలిక పై అత్యాచారం.. ఆపై గొంతు కొరికి చంపేసిన కిరాతకుడు!

మూడేళ్ల బాలిక ను బాత్రూంలో బంధించి అత్యాచారం చేసి,గొంతును పళ్లతో కొరికి  చంపేసిన ఘటన చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో చోటుచేసుకుంది. 

New Update
Rape Case: తిరుపతిలో దారుణం.. 6 ఏళ్ల బాలికను 65 ఏళ్ల వృద్దుడు ఏం చేశాడంటే!

దేశంలో  బాలికలకు,మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మరోసారి రుజువైంది. ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు, కఠిన చర్యలు తీసుకుంటున్నా ఆడ పిల్లలపై అఘాయిత్యాలు మాత్రం ఆగటం లేదు. నిత్యం ఎక్కడో ఓ చోట మానవ మృగాల కామవాంఛకు బలవుతూనే ఉన్నారు. తాజాగా చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ లో మూడేళ్ల బాలిక పై  జరిగిన అత్యాచార ఘటన ఇందుకు ఉదాహరణ.

సిర్గిటీ లోని కూలి పనులు చేసుకుంటూ ఓ కుటుంబం జీవనం సాగిస్తుంది. వారికి మూడేళ్ల కూతురు ఉంది. రోజువారిలో భాగంగా ఆదివారం తల్లిదండ్రులు పనికి వెళ్లారు. ఇంటి కి వచ్చిన తల్లి తన కూతురు కనిపించకపోవటంతో ఇంటి చుట్టు ప్రక్కల అంత వెతికింది. ఈ క్రమంలో అటుగా వెళుతున్న ఒకరు ఆమెకు ఒక 14 ఏళ్ల యువకుడు ఒక పాపను బాత్రుంలో  తీసుకువెళ్లాడు అని చెప్పారు. దీంతో బాత్రూంలో వెళ్లి చూడగా రక్తపు మడుగులో పడి ఉన్న తన కూతురిని వెంటనే ఆసుపత్రికి తరలించింది. అప్పటికే బాలిక చనిపోయిందని వైద్యులు ఆమెకు తెలిపారు. బాలిక మృతి పై తల్లిదండ్రులు పోలీసులకు (Police) ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు బాలికకు పోస్టుమార్టం నిర్వహించారు.

పోలీసుల కథనం ప్రకారం: 

ఆదివారం సాయంత్రం  ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను అదే ప్రాంతానికి చెందిన 14 ఏళ్ల యువకుడు  బాత్రూంలోకి తీసుకువెళ్లాడు.  మొదట  బాలిక పై లైంగిక దాడికి పాల్పడిన ఆ యువకుడు   బాలిక ప్రైవేట్ భాగలపై గోళ్లతో గిచ్చాడని  పోలీసులు తెలిపారు.అత్యాచారం అనంతరం బాలిక కేకలు వేయడంతో నిందితుడు ఆమె గొంతు కొరికి చంపినట్లు వెల్లడించారు..పోస్టుమార్టం నివేదికలో బాలిక అత్యాచారం గురైందని బిలస్ పూరు ఎస్పీ రాజ్ నేష్ సింగ్ వెల్లడించారు. నిందుతుడి పై వివిధ సెక్షన్లలో కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరుస్తున్నామని తెలిపారు. అలాగే నిందితుడి మేనమామకు ఈ విషయాన్ని దాచి పెట్టడానికి ప్రయత్నించటంతో  అతనిపై కూడా కేసు నమోదు చేసినట్లు ఎస్పీ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు