Crime News: లారీ ఢీకొని ముగ్గురు మృతి..!

అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం చోటుచేసుకుంది. లారీ బైకును ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. దుప్పుతూరి నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ బంధువులు ధర్నా చేపట్టారు.

Accident : ఘోర ప్రమాదం.. 40 అడుగుల గోతిలో పడిన బస్సు.. 15 మంది మృతి!
New Update

Anakapalli: అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో దారుణం చోటుచేసుకుంది. బైకును లారీ ఢీకొట్టడంతో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. వెంటనే అప్రత్తమైన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దుప్పుతూరి నుంచి అచ్యుతాపురం వెళ్తుండగా ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.

Also read: విశాఖలో విషాదం.. SPF కానిస్టేబుల్ బలవన్మరణం..

ఈ విషయంపై సమాచారం అందుకున్న బాధిత కుటుంబాలు వెంటనే ఘటన స్థలంకు చేరుకున్నారు. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ అచ్యుతాపురం- ఎలమంచిలి ప్రధాన రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సంఘటన స్థలంకు చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

#anakapalli-district
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe