మూడు రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ మిస్సింగ్..చెరువులో డెడ్ బాడీ..మర్డరేనా?

అతనిది హత్యనా.. లేక ఆత్మహత్యనా.. మిస్టరీగా మారిన కోడూరు ఫీల్డ్ ఆసిస్టెండ్ మృతి. మూడు రోజుల క్రితం అదృశ్యమైన పూజరి యాకస్వామి. ఈరోజు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలాడు.

New Update
మూడు రోజుల క్రితం ఫీల్డ్ అసిస్టెంట్ మిస్సింగ్..చెరువులో డెడ్ బాడీ..మర్డరేనా?

జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన ఫీల్డ్ అసిస్టెంట్ మూడు రోజుల క్రితం కనిపించకుండా పోయాడు. ఇప్పుడు గ్రామ సమీపంలోని చెరువులో శవమై తేలడం స్థానికంగా సంచలనంగా మారింది. అతనిది హత్యనా.. లేక ఆత్మహత్యనా అన్నది మిస్టరీగా మారింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి రెండు కోణాల్లో దర్యాప్తు మొదలు పెట్టారు.

ఇక డీటైల్స్ లోకి వెళితే..జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం కోడూరు గ్రామానికి చెందిన పూజరి యాకస్వామి ఫీల్డ్ అసిస్టెంట్ గా పనిచేస్తున్నాడు. కాగా, మూడు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లిన యాకస్వామి తిరిగి రాలేదు. దీంతో రెండు రోజుల క్రితం అతని భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు ఈ కంప్లైంట్ తో అతడ్ని వెతికే పనిలో పడ్డారు. ఈలోగా యాకస్వామి కోడూరు గ్రామానికి సమీపంలో ఉన్న ఓ చేరుచెరువులో డెడ్ బాడీ అయి తేలాడు.

మరో వైపు చేరు చెరువు దగ్గర యాకస్వామికి సంబంధించిన టూవీలర్ కూడా ఉండడంతో గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు ఘటనా స్థలికి చేరుకొని యాకస్వామి శవాన్ని చెరువులో నుంచి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అయితే యాకస్వామి ఒక వేళ ఆత్మహత్య చేసుకుంటే అందుకు కారణాలు వెతుకుతున్న పోలీసులు.. హత్య అయితే ఎవరు.. ఎందుకు చేసి ఉంటారనే యాంగిల్ లో విచారణ జరుపుతున్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు