This week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలు

ఈ వారం థియేటర్స్ లో సందడి చేయనున్న చిత్రాలు ఇవే. హర్ష చెముడు నటించిన ‘సుందరం మాస్టర్‌', అభినవ్ గోమఠం ‘మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా' సరి కొత్త లవ్ స్టోరీ ‘సిద్ధార్థ్‌ రాయ్‌’ చిత్రాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. పూర్తి వివరాల కోసం హెడ్డింగ్ పై క్లిక్ చేయండి.

New Update
This week Movies: ఈ వారం థియేటర్స్ లో సందడి చేయబోతున్న చిత్రాలు

This week Movies: గత వారం స్టార్ హీరోల సినిమాలతో పాటు పలు చిన్న సినిమాలు కూడా థియేటర్స్ వద్ద సందడి చేశాయి. రజినీకాంత్ లాల్ సలాం, రవితేజ ఈగల్ , సందీప్ కిషన్ ఊరు పేరు భైరవకోన, ట్రూ లవర్, అంబాజీ పేట మ్యారేజ్ బ్యాడ్ చిత్రాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇక ఈ వారం కూడా పలు సినిమాలు థియేటర్స్ లో సందడి చేయడానికి సిద్ధంగా ఉన్నాయి. ఆ సినిమాల లిస్ట్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

Also Read: Sharmila Son Raja Reddy Marriage: కుమారుడు రాజారెడ్డి పెళ్ళి వేడుకల్లో డాన్స్ వేస్తున్న షర్మిల.. వైరలవుతున్న ఫొటోస్

సుందరం మాస్టర్‌

కమెడియన్ హర్ష చెముడు ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'సుందరం మాస్టర్‌'. కళ్యాణ్ సంతోష్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. దివ్య శ్రీపాద ఫీమేల్ లీడ్ రోల్ లో నటించింది. ఫిబ్రవరి 23న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ కూడా భారీగానే చేస్తున్నారు. తాజాగా మూవీని ప్రమోట్ చేస్తూ గ్రాండ్ గా ఓ ఈవెంట్ కూడా నిర్వహించారు. రిలీజ్ దగ్గర పడడంతో నేడు ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా నిర్వహించారు.

publive-image

మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా

తిరుపతి రావు ఇండ్ల దర్శకత్వంలో అభినవ్‌ గోమఠం ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మస్తు షేడ్స్‌ ఉన్నయ్‌రా. కామెడీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ చిత్రంలో తరుణ్‌ భాస్కర్‌, అలీ రెజా, వైశాలి కీలక పాత్రలు పోషించారు. ఫిబ్రవరి 23న ఈ మూవీ థియేటర్స్ లో విడుదల కానుంది.

publive-image

సిద్ధార్థ్‌ రాయ్‌

దాదాపు టాలీవుడ్ లో అందరు స్టార్ హీరోలతో నటించిన చైల్డ్ ఆర్టిస్ట్.. దీపక్ సరోజ్ హీరోగా తెరకెక్కిన మూవీ సిద్ధార్థ్‌ రాయ్‌. వి యశస్వీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే రిలీజైన ఈ మూవీ ట్రైలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ సినిమా కూడా ఫిబ్రవరి 23న థియేటర్స్ లో సందడి చేయనుంది.

publive-image

ముఖ్య గమనిక

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కజిన్ విరాన్ ముత్తంశెట్టి హీరోగా తెరకెక్కిన సినిమా ‘ముఖ్య గమనిక’. డెబ్యూ డైరెక్టర్ వేణు మురళీధర్‌ దర్శకత్వం ఈ సినిమాకు  వహించారు. లావణ్య కథానాయికగా నటించారు. థ్రిల్లింగ్ ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా ఈ చిత్రాన్ని రూపొందించారు. ఈ నెల ఫిబ్రవరి 23న ప్రేక్షకుల ముందుకు రానుంది.

publive-image

Also Read: Anushka Shetty: ‘శీలావతిగా’.. అనుష్క.. 14 ఏళ్ళ తర్వాత మరో సారి క్రిష్, అనుష్క కాంబో రిపీట్

Advertisment
తాజా కథనాలు