AP: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!

విశాఖలో నిత్య పెళ్లికొడుకుపై మూడో భార్య కలెక్టర్‌కు ఫిర్యాదు చేసింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్‌ వద్ద వేడుకొంది.

AP: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!
New Update

Vishaka: నా భర్త నుండి నాకు రక్షణ కల్పించండి అంటూ ఒక మహిళ అనకాపల్లి కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసింది. పరవాడ మండలం వాడ చీపురుపల్లి గ్రామానికి చెందిన వడ్డాది సుజి 2015 లో విశాఖపట్నం కొమ్మాది ప్రాంతానికి చెందిన వడ్డాది గోవింద్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో పరిచయమైన గోవింద్ కుమార్ ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. సుజీ తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. సుజి తల్లిదండ్రులు పెళ్లి విషయం మౌనం వహించడంతో సుజీ గోవింద్ కుమార్ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకుంది.

విస్తరిపోయే విషయాలు..

సుజీ తల్లిదండ్రులు అయినప్పటికీ లాంఛనంగా అల్లుడికి ఇవ్వాల్సిన కట్న కానుకలు ఇవ్వడం జరిగింది. పెళ్లయిన కొన్ని రోజుల వరకు గోవింద్ కుమార్ సుజి తో కొన్నాళ్లు అన్యోన్యంగా ఉన్నప్పటికీ సుజి మొదట సంతానం కలిగిన తర్వాత గోవింద్ కుమార్ లో మార్పు చోటు చేసుకుంది. తర్వాత నుంచి ఇంటికి కూడా రాకపోవడంతో సుజీ ఫోన్లు చేయడం మొదలు పెట్టింది. గోవింద్ కుమార్ ప్రవర్తనపై అనుమానం కలిగిన సుజి అతని గురించి ఎంక్వైరీ చేయడం మొదలుపెట్టింది. దీంతో సుజికి విస్తరిపోయే విషయాలు తెలిసాయి.

రెండు పెళ్లిళ్లు..

అప్పటికి గోవింద్ కుమార్ కి రెండు పెళ్లిళ్లు జరిగాయని మొదటి భార్యకు గోవింద్ మధ్య విడాకుల వ్యవహారం కోర్టులో నడుస్తుందన్న విషయాలు సైతం బయటికి వచ్చాయి. దీనిపై సుజి గోవింద్ కుమార్ ను అతని కుటుంబ సభ్యులను నిలదీయడంతో సుజిపై భౌతిక దాడులకు దిగడం ప్రారంభించారు. దీంతో ఆమె భర్తపై అతని కుటుంబ సభ్యులు 498 ఏ కేసు పెట్టింది. సుజీ పై కక్ష పెంచుకున్న గోవింద్ కుమార్ కత్తితో దాడి చేయగా మెడపై గాయం అయింది. పుట్టింటికి చేరుకున్న సుజీ పెద్ద మనుషులు మధ్య గొడవ పెట్టడంతో వారందరూ భార్యాభర్తల మధ్య రాజీ చేసి తిరిగి కాపురానికి పంపించారు.

Also Read: బడి నుంచి వెళ్లి.. గ్యాస్ డెలివరీ బాయ్‌ ఇంట్లో శవమైన విద్యార్థిని..!

నాలుగో భార్యతో దొంగతనం

అయినప్పటికీ సుజీపై వేధింపులు ఆగలేదు. గోవింద్ కుమార్ సోనాలి అనే అమ్మాయిని నాలుగో వివాహం చేసుకున్నాడు. ఇద్దరు కలిసి ఒక జ్యువలరీ షాప్ లో దొంగతనం చేయడంతో వారిద్దరిని ఎంపీపీ పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపారు. గోవింద్ కుమార్ సోనాలి నీ కూడా నాలుగో వివాహం చేసుకున్నట్లు బయటికి రావడంతో సుజి ఈ వ్యవహారాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించింది. ఇదే విషయాన్ని బయటకు తెలిపితే చంపుతానని సుజిని గోవింద్ కుమార్ హెచ్చరించాడు.

మెంటల్ ఉందని నటిస్తూ..

అయినప్పటికీ సుజి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సుజీ పై కక్ష పెంచుకున్న గోవింద కుమార్ ఆమెపై దాడి చేశారు. దీంతో సుజిత్ తల్లిదండ్రులు సహాయంతో పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కేసు నమోదు చేసి గోవింద్ కుమార్ జైలుకు పంపారు. గోవింద్ కుమార్ తనకు మెంటల్ ఉందని నటిస్తూ మెంటల్ ఆసుపత్రికి ట్రీట్మెంట్ కు నెల రోజులు పాటు ఉన్నాడని మెంటల్ సర్టిఫికెట్ తీసుకొని కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారని సుజీ ఆరోపించింది.

నష్టపరిహారం వద్దు.. విడాకులు కావాలి..

గోవింద్ కుమార్ వల్ల తనకు ప్రాణహాని ఉందని పోలీసు అధికారులకు విన్నవించుకున్నప్పటికీ తమ పరిధిలో ఉన్నంతవరకు మాత్రమే సహాయం చేయగలమని అంతకుమించి చేయలేము అని పోలీసులు చేతులెత్తేశారు. తిరిగి గోవింద్ కుమార్ కల్పించకుండా ఎక్కడైనా అజ్ఞాతంగా ఉండమని ఉచిత సలహా ఇచ్చారని సుజి వాపోయింది. ఇద్దరు పిల్లలతో ఉన్న తనకు భర్త నుండి ఎటువంటి నష్టపరిహారం వద్దని అతని నుండి విడాకులు ఇప్పించి నాకు రక్షణ కావాలని అనకాపల్లి కలెక్టర్ కు సుజి ఫిర్యాదు చేసింది. కేసులు విత్ డ్రా చేసుకోవాలని గోవింద కుమార్ కుటుంబ సభ్యులు కూడా తమపై ఎస్సీ ఎస్టీ కేసులు పెడతామని బెదిరిస్తున్నారు సుజి ఆరోపించింది.

#vishaka #crime-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి