Vishaka: నా భర్త నుండి నాకు రక్షణ కల్పించండి అంటూ ఒక మహిళ అనకాపల్లి కలెక్టర్ కు ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఫిర్యాదు చేసింది. పరవాడ మండలం వాడ చీపురుపల్లి గ్రామానికి చెందిన వడ్డాది సుజి 2015 లో విశాఖపట్నం కొమ్మాది ప్రాంతానికి చెందిన వడ్డాది గోవింద్ కుమార్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. 2014లో పరిచయమైన గోవింద్ కుమార్ ప్రేమ పేరుతో వంచించి పెళ్లి చేసుకున్నాడు. సుజీ తన ప్రేమ వ్యవహారాన్ని తల్లిదండ్రులకు చెప్పి పెళ్లికి ఒప్పించే ప్రయత్నం చేసింది. సుజి తల్లిదండ్రులు పెళ్లి విషయం మౌనం వహించడంతో సుజీ గోవింద్ కుమార్ తల్లిదండ్రుల సమక్షంలో వివాహం చేసుకుంది.
పూర్తిగా చదవండి..AP: నాలుగో పెళ్లి చేసుకున్న దొంగమొగుడు.. విడాకులు కావాలంటున్న మూడో భార్య..!
విశాఖలో నిత్య పెళ్లికొడుకుపై మూడో భార్య కలెక్టర్కు ఫిర్యాదు చేసింది. నాలుగు పెళ్లిళ్లు చేసుకొని తనను మోసం చేశాడని ఆవేదన వ్యక్తం చేసింది. అడిగితే తనను చంపేస్తానని బెదిరిస్తున్నాడని వాపోయింది. తనకు న్యాయం చేసి ఆదుకోవాలని కలెక్టర్ వద్ద వేడుకొంది.
Translate this News: