మణిపూర్ బాధితురాలి తల్లి మాటలు అందరిని ఆలోచనలో పడేశాయి. తన కుటుంబం భవిష్యత్ గురించి ఆలోచిస్తే కళ్ల ముందు అంతా శూన్యమే కనిపిస్తోందని.. నాకు ఎలాంటి ఆశ లేదని.. తాను నిస్సహాయురాలిగా మారానంటూ బాధిత తల్లి చెబుతున్న మాటలు దేశం మొత్తానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
Translate this News:మణిపూర్ బాధిత మహిళ తల్లి
మణిపూర్(manipur)లో ముగ్గురు మహిళలను వివస్త్రలుగా మార్చి ఊరేగించిన ఘటన యావత్ దేశాన్ని కదిలించింది. ముగ్గురు మహిళలను బట్టలు లేకుండా ఊరేగించి..తర్వాత అందులో ఓ యువతిని సామూహికంగా అత్యాచారం చేశారన్న వార్త బయటకు వచ్చిన తర్వాత నుంచి దేశంలో ఆగ్రహజ్వాలలు ఎగిసిపడుతున్నాయి. మరోవైపు బాధిత మహిళలు అనుభవించిన నరకం గురించి తలచుకుంటూ సమాజం కన్నీరుపెడుతోంది. ఆ సమయంలో వాళ్ల పడ్డ నరకయాతన అంతాఇంతా కాదు.. చుట్టూ మగాళ్లు..ఊరంతా చూస్తుండగా..తాక కూడని చోటా తాకుతూ..తమ శరీరాలని బొమ్మలా ఆడుకుంటూ, వాడుకుంటూ అత్యంత పైశాచికంగా ప్రవర్తించడం చూస్తే మనసు మెలిపెడుతోంది. ఈ ఉదంతం గురించి వింటుంటేనే ఇలా ఉంటే.. అనుభవించిన వారి బాధ ఎలా ఉంటుందన్నది ఆలోచిస్తేనే ఒళ్లు గగుర్పొడుస్తోంది. బాధిత మహిళల్లో ఒకరి తల్లి(mother) తన ఆవేదనను ప్రపంచంతో పంచుకుంది. పలకరించగానే కొన్ని నిమిషాల పాటు మౌనంగా ఉన్న ఆమె…లోపల నుంచి వస్తున్న ఉద్వేగాన్ని ఆపుకుని ఆ రోజు జరిగిన విషాదాన్ని కళ్లకు కట్టింది.
బాధిత తల్లి ఏం చెప్పారంటే..? ‘నా ఆశలు కూలిపోయాయి..! లోయ ప్రాంతపు మెయితెయిలు, కొండ ప్రాంతపు కుకీల మధ్య మే 3న ఘర్షణలు చెలరేగాయి. ఆ తర్వాతి రోజే అంటే….మే 4న నా కూతురిని బలవంతంగా బట్టలు విప్పమని నగ్నంగా ఊరేగించారు. అంతకుముందు జరిగిన హింసలో నా భర్తను, కొడుకును అత్యంత దారుణంగా హత్య చేశారు. హింసను ఆపేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేదు. నేను నా చిన్న కొడుకును కోల్పోయాను..అతనిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాను. వాడిని చాలా కష్టపడి స్కూల్కు పంపించాను. వాడు 12వ తరగతి పూర్తి చేశాడు. ఇప్పుడు వాడి తండ్రి కూడా నాతో లేడు. పెద్ద కొడుకుకు ఉద్యోగం లేదు. నా కుటుంబం భవిష్యత్ గురించి ఆలోచిస్తే నా కళ్ల ముందు అంతా శూన్యమే కనిపిస్తోంది. నాకు ఎలాంటి ఆశ లేదు. నేను నిస్సహాయురాలిగా మారాను’ అంటూ బాధిత తల్లి చెబుతున్న మాటలు దేశం మొత్తానికి కన్నీళ్లు తెప్పిస్తున్నాయి.
న్యాయం కావాలి: మణిపూర్ బాధితురాలి తల్లి మాటలు అందరిని ఆలోచనలో పడేశాయి. తన కూతురికి జరిగిన ఘోరం పట్ల నిజాన్ని ఎంతో ధైర్యంగా సమాజంతో పంచుకున్న ఆమె మాటలు మిగిలిన వారిలోనూ ధైర్యాన్ని నింపాయి. తమ కుటుంబానికి జరిగిన అన్యాయం పట్ల బాధిత మహిళ జవాబుదారీతనం కావాలంటోంది. తన కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తోంది. ఆమె సంకల్పం దేశవ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. హింసాత్మక చర్యకు పాల్పడిన వారి హేయమైన చర్యలకు కఠినమైన శిక్షను విధించాలన్న ఆమె కోరిక నెరవేరాలని ప్రజలు కోరుకుంటున్నారు. కులమతాలతో సంబంధం లేకుండా..పార్టీలను ముడిపెట్టకుండా దేశం బాధితుల వెంటే నిలుస్తుండడం మంచి విషయం.