Crime News: ఫుల్ గా మద్యం తాగాడు.. కోరికలు తీర్చకపోవడంతో మహిళను ఏం చేశాడంటే..?

కాకినాడ జిల్లా రాజులకొత్తూరు సమీపంలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. ఈ నెల 19వ తేదిన మహిళ వంటిపై దుస్తువులు లేకుండా కాళ్లు, చేతులు కట్టి చనిపోయిన మృతదేహం లభ్యమైంది. హత్యచేసిన నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన నందిగామ ప్రవీణ్ గా గుర్తించారు.

Crime News: ఫుల్ గా మద్యం తాగాడు.. కోరికలు తీర్చకపోవడంతో మహిళను ఏం చేశాడంటే..?
New Update

Kakinada: కాకినాడ జిల్లా తుని మండలం రాజులకొత్తూరు సమీపంలో మహిళ మృతదేహం కేసును పోలీసులు ఛేదించారు. తుని రూరల్ సీఐ ఎస్ వి వి ఎస్ మూర్తి మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాలు వెల్లడించారు. ఈ నెల 19వ తేదిన మహిళ వంటిపై దుస్తువులు లేకుండా కాళ్లు, చేతులు కట్టి చనిపోయిన మృతదేహం లభ్యమైంది. మహిళా మృతదేహాన్ని జాతీయ రహదారి సమీపంలో దుండగుడు మట్టి రోడ్డుపై పడేశాడు.

Also Read: ఛీ వీళ్లేం మనుషులు రా దేవుడా.. ఇంత ఘోరంగా ఉన్నారు..!

గుర్తు తెలియని మృతదేహాన్ని స్వాధీన పరచుకుని విచారణ చేపట్టిన తుని పోలీసులు.. మృతురాలు అల్లూరి జిల్లా సిలేరులో జీకే వీధికి చెందిన వేశ్యగా గుర్తించారు. హత్యచేసిన నిందితుడు ఖమ్మం జిల్లాకు చెందిన నందిగామ ప్రవీణ్ గా గుర్తించారు. పాయకరావుపేట డెక్కన్ కెమికల్ కంపెనీలో ప్రొడక్షన్ మేనేజర్ గా పని చేస్తున్న నిందితుడు ప్రవీణ్..18 ఏళ్లగా పాయకరావుపేటలో నివాసం ఉంటున్నాడు.

Also Read: విశాఖ కేజీహెచ్ లో లైంగిక వేధింపులు.. నర్సింగ్ సూపరిండెంట్ సంచలన వ్యాఖ్యలు..!

ఈ నెల 18న భార్య ఇంటి దగ్గర లేకపోవడంతో ఫుల్ గా మద్యం సేవించిన ప్రవిణ్.. తుని ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద బేరం కుదుర్చుకుని మృతురాలిని ఇంటికి తీసుకెళ్లాడు. అనుకున్నా విదంగా సెక్స్ కోరికలు తీర్చకపోవడంతోనే మద్యం మత్తులో హత్య చేశాడు. గతంలో కూడా మృతురాలిని ప్రవీణ్ ఇంటికి తీసుకెళ్లి సెక్స్ కోరికలు తీర్చుకున్నాడు. మహిళను అతి క్రూరంగా పీక నులిమి హత్య చేసినట్లు పోలిసులు విచారణలో తేలింది. నిందితుడు ప్రవీణ్ ని పలు సెక్షన్ కింద కేసు నమోదు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు.

#kakinada
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe