Penny Stocks : ఇది కదా కిక్ అంటే..ఆరునెలల్లో లక్ష రూపాయలను 3లక్షలు చేసిన షేర్.. 

షేర్ మార్కెట్ అంటేనే రిస్క్ ఎక్కువ. అయితే, ఒక్కోసారి చిన్న స్టాక్ అనుకున్నది కొన్ని నెలల్లోనే ఎన్నో రెట్లు లాభాలను తెచ్చి పెట్టొచ్చు. ఇప్పుడు హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు ఆ పనే చేస్తున్నాయి. గత ఆరు నెలల్లో 200 శాతం రాబడిని ఈ షేర్లు ఇచ్చాయి. 

New Update
Penny Stocks : ఇది కదా కిక్ అంటే..ఆరునెలల్లో లక్ష రూపాయలను 3లక్షలు చేసిన షేర్.. 

Penny Shares : కొన్ని సంవత్సరాలుగా,  పెన్నీ షేర్స్(Penny Shares) తక్కువ సమయంలో పెట్టుబడిదారులకు అధిక రాబడిని అందిస్తూ వస్తున్నాయి. దీనికి తాజా ఉదాహరణ హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు. ఐదేళ్లలో ఇన్వెస్టర్స్ ని  లక్షాధికారులను చేయడంలో ఈ కంపెనీ షేర్లు పరుగులు తీశాయి. గత ఆరు నెలలుగా రియల్ ఎస్టేట్ కంపెనీ షేర్లలో అప్‌వర్డ్ ట్రెండ్ ఉంది. ఈ సమయంలో, ఈ స్మాల్ క్యాప్ స్టాక్(Penny Stocks) దాదాపు రూ.126 నుండి రూ.380కి పెరిగింది. అంటే ఈ కాలంలో పెట్టుబడిదారులు 200 శాతం రాబడిని పొందారు.

నిపుణులు చెబుతున్న లెక్కల ప్రకారం.. ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో ఇంకా కొంత పైకి వెళ్లే ఛాన్స్ లు ఉన్నాయి. గత ఐదు వరుస సెషన్లలో స్మాల్ క్యాప్ స్టాక్స్(Penny Stocks) అప్పర్ సర్క్యూట్‌ను తాకుతున్నాయి. గత వారంలో కంపెనీ షేర్లు 15 శాతానికి పైగా పెరిగాయి. BSE వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం, జనవరి 31, 2024 నుండి హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్ షేర్లు నిరంతరం 5 శాతం ఎగువ సర్క్యూట్‌ను చూస్తున్నాయి. గత ఐదేళ్లలో కంపెనీ షేర్లలో ఎంత వృద్ధి కనిపించింది, ఇన్వెస్టర్లకు (Penny Stocks)ఎంత మేలు జరిగింది అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం. 

Also Read : అమ్మో వెల్లుల్లి ఘాటు.. మామూలుగా లేదు.. రికార్డు రేటు!

కంపెనీ షేర్ పెరిగింది ఇలా.. 

  1. గత నెలలో హజూర్ మల్టీ ప్రాజెక్ట్స్(Hazoor Multi Projects Ltd) షేర్లు 4 శాతానికి పైగా పెరిగాయి. కంపెనీ షేర్లు రూ.364 నుంచి రూ.380కి ఎగిశాయి. 
  2. గత ఆరు నెలల్లో ఈ స్మాల్ క్యాప్ మల్టీబ్యాగర్ స్టాక్(Penny Stocks) ఒక్కో షేరుకు రూ.126 నుంచి రూ.380 స్థాయికి చేరుకుంది. అంటే కంపెనీ షేర్లు 200 శాతానికి పైగా పెరిగాయి.
  3. గత ఏడాదిలో ఈ మల్టీబ్యాగర్ స్టాక్ రూ.103.50 నుంచి రూ.380కి పెరిగింది. అంటే కంపెనీ పెట్టుబడిదారులకు 267 శాతం రాబడిని అందించింది.
  4. గత ఐదు సంవత్సరాలలో, ఈ స్మాల్ క్యాప్ స్టాక్ పెన్నీ స్టాక్ నుండి మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌కి ప్రయాణించింది. గత ఐదేళ్లలో, మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్ తన వాటాదారులకు 33,500 శాతం రాబడిని ఇచ్చింది. అంటే అప్పుడు రూ.1.13 షేర్ ఇప్పుడు రూ.380కి చేరింది.

పెట్టుబడిపై ప్రభావం ఇదీ.. 

  1. ఒక ఇన్వెస్టర్ ఆరు నెలల క్రితం ఈ మల్టీబ్యాగర్(Penny Stocks) స్మాల్ క్యాప్ స్టాక్‌లో రూ.1 లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, దాని విలువ నేడు రూ.3 లక్షలుగా ఉండేది.
  2. ఇన్వెస్టర్ ఏడాది క్రితం ఈ మల్టీబ్యాగర్ స్టాక్‌లో రూ.లక్ష పెట్టుబడి పెడితే, దాని విలువ రూ.3.65 లక్షలుగా ఉండేది.
  3. అదే విధంగా ఐదేళ్ల క్రితం ఈ మల్టీబ్యాగర్ పెన్నీ స్టాక్‌(Penny Stocks)లో ఇన్వెస్టర్ రూ.లక్ష పెట్టుబడి పెడితే, ఈరోజు దాని విలువ రూ.3.36 కోట్లుగా ఉండేది.

గమనిక: ఈ ఆర్టికల్ పాథమిక అవగాహన కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడూ రిస్క్ తో ఉంటుంది. స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నపుడు ఆర్ధిక సలహాదారుల సూచనలను తీసుకోవడం మంచిదని సూచిస్తున్నాం.

Watch this Interesting News :

Advertisment
తాజా కథనాలు