Suchana Seth: తండ్రి పోలికలతో కొడుకు.. ఆ కోపంతో చిన్నారిని హింసించి చంపిన సీఈవో!

తన నాలుగేళ్ల కుమారుడును 'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO సుచనా సేథ్‌ హత్య చేసిన విషయం తెలిసిందే. కొడుకు అచ్చం తండ్రి పోలికలతోనే ఉండడం సుచనాకు ఇష్టం లేదట. భర్తపై ఉన్న ద్వేషాన్ని నిత్యం కొడుకుపై సుచనా చూపించేదని సమాచారం.

Suchana Seth: తండ్రి పోలికలతో కొడుకు.. ఆ కోపంతో చిన్నారిని హింసించి చంపిన సీఈవో!
New Update

ద్వేషం.. అన్నిటికంటే ఘోరమైనది. ద్వేషంతో నిండి ఉన్న మనుసు ఎన్ని దారుణాలకైనా తెగిస్తుంది. ద్వేషం మనుషులను వారి మనసులను సర్వనాశనం చేస్తుంది. ఎవరిపై ద్వేషం ఉంటుందో వారు ఏం చేసినా తప్పుగానే అనిపిస్తుంది. ఒకరిపై కోపం మరొకరిపై చూపిస్తే ఆ బాధ క్షణ,నిమిష కాలమే ఉండొచ్చు కానీ.. ఒకరిపై ద్వేషం మరొకరిపై చూపిస్తే మాత్రం జీవితమే తలకిందులవుతుంది. అదే ద్వేషం అభంశుభం తెలియని చిన్నారిపై చూపిస్తే ఎంత మూర్ఖత్వమో కదా..!'ది మైండ్‌ఫుల్ AI ల్యాబ్' CEO సుచనా సేథ్‌(Suchana Seth) అలాంటి మూర్ఖురాలే.. భర్తపై ఉన్న ద్వేషాన్ని కొడుకుపై చూపించి కడతేర్చింది.

ALSO READ: ‘ భర్త నాకు నెలకు రూ.2.5 లక్షల మెయింటెనెన్స్ అలవెన్స్ కావాలి..’ షాకింగ్ విషయాలు!

తండ్రి పోలికలతో ఉన్నాడని:

అయిన వారిని, తెలిసిన వారిని హత్య చేసే వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. ఈ మర్డర్లు కేవలం ఒక కారణంతోనే జరిగాయని చెబితే అది తప్పే అవుతుంది. మనసులో పేరుకుపోయిన అనేకనేక కారణాలు చివరకు ఓ పెద్ద కారణానికి దారితీసి.. అప్పటివరకు గూడుకట్టుకొని ఉన్న ద్వేషం, అసహనం బయటకొచ్చి హత్యలు చేసేలా చేస్తాయి. సుచనా సేథ్‌ నాలుగేళ్ల కుమారుడు అచ్చం అతని తండ్రి వెంకట్ రామన్‌ పోలి ఉంటాడట. ఆ చిన్నారి ఆడి పాడుతుంటే సుచనా సేథ్‌కు భర్తే గుర్తొచ్చేవాడట. అతని అల్లరి కూడా తండ్రి జ్ఞాపకాలను గుర్తు తెచ్చేదిగా ఉంటుందని.. అందుకే కన్నకొడుకు అంటే సుచనా సేథ్‌కు ముందు నుంచి అసంతృప్తినేనని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. అయినా ఎంత విడ్డూరమో కదా.. బిడ్డకు తల్లి లేదా తండ్రి పోలికలు రాకుండా ఎలా ఉంటాయ్‌.. ఎన్నో ఉన్నత చదువులు చదివి.. ఓ కంపెనీని ఏలే స్థాయికి ఎదిగిన సుచనాకు ఈ విషయం తెలియదా అంటే ఎందుకు తెలియదు.. కచ్చితంగా తెలుసు..! కానీ మనసులో నాటుకపోయిన భర్తపై ద్వేషం అనే భావన ఈ విజ్ఙతకు అడ్డుపడింది కాబోలు.

వెయిట్ చేసి చేసి వెళ్లిపోయాడు:

విడాకుల కోసం సుచనా, రామన్‌ అప్లై చేసిన తర్వాత కోర్టు ఆదేశాలకు అనుగుణంగా నడుచుకోవాల్సి వచ్చింది. ఇందులో భాగంగా తన కొడుకును చూసేందుకు కోర్టు రామన్‌కు అనుమతనిచ్చింది. ప్రతి ఆదివారం కొడుకును చూడవచ్చని చెప్పింది. సుచనా, రామన్‌కి బెంగళూరు(Bangalore)లో ఒకి ఇల్లు ఉంది. అక్కడే కొడుకును కలవడానికి ఓ ఆదివారం రామన్ వస్తానన్నాడు. అతను నిజానికి ఇండోనేషియాలో ఉంటున్నాడు. అయితే ఇంటికి రావడానికి వీల్లేదని.. బయట ఒక ప్లేస్‌లో కాలుద్దామని సుచనా చెప్పడంతో రామన్‌ సరే అన్నాడు. తీరా ఆదివారం ఆ ప్లేస్‌కు వచ్చిన తర్వాత సుచనాకు ఎన్నిసార్లు కాల్ చేసినా లిఫ్ట్ చేయలేదు. దీంతో ఆ పూటంతా అక్కడే గడిపిన రామన్‌కు సుచనా ఉద్దేశం అర్థమై ఆ రాత్రే ఇండోనేషియా వెళ్లిపోయాడు. తర్వాతి ఆదివారానికి అసలు కొడుకే లేకుండాపోయాడు.

Also Read: భర్త చేసిన పనికి కన్నీళ్లు పెట్టుకున్న నయన్.. అది బెస్ట్ ఎగ్జాంపుల్ అంటూ

WATCH:

#bangalore #suchana-seth
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe