తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మ్రోగించిన విజయ దుందుభి భారత దేశ వ్యాప్తంగా ప్రతిధ్వనిస్తోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు నేతలు మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. వీరిలో ములుగు ఎమ్మెల్యే సీతక్క కూడా మంత్రిగా భాద్యతలు చేపట్టారు.సీతక్క ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లో ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. కరోనా సమయంలో తన సేవలతో రాష్ట్ర వ్యాప్తంగా మంచి గుర్తింపు పొందిన సీతక్క(Seethakka).. ఇప్పుడు మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు, గిరిజన సంక్షేమ శాఖా మంత్రిగా బాధ్యతలు చేపట్టిన సందర్బంగా నక్షలైట్ నుంచి మినిష్టర్ దాకా సాగిన రాజకీయ ప్రస్థానంపై ఓ లుక్కేయండి.
అన్నాయాలను ప్రశ్నించే తత్వం:
సీతక్క అసలు పేరు అనసూయ దంసారి. వరంగల్ జిల్లా ములుగు మండలం.. జగన్నపేట గ్రామంలో ఆదివాసీ కుటుంబంలో జులై 9, 1971 లో జన్మించారు సీతక్క . .సమ్మయ్య, సమ్మక్క దంపతులకు రెండో సంతానంగా పుట్టిన సీతక్క ములుగు జిల్లాలోని ప్రభుత్వ హాస్టల్ లో ఉంటూ.. పదవ తరగతి వరకు చదువుకున్నారు. చిన్ననాటి నుంచే ఆదివాసీలకు జరుగుతున్న అన్యాయాలను ప్రశ్నించడం మొదలు పెట్టారు.
విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం:
తెలంగాణ కాంగ్రెస్ లో మహిళా ఫైర్ బ్రాండ్ గా పేరు తెచ్చుకున్న సీతక్క ప్రస్తుతం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి ఒక సెంటిమెంట్ గా మారారు అనడంలో అతిశయోక్తి లేదు. విద్యార్థి దశ నుంచే పోరాట జీవితం మొదలు పెట్టిన ఆమె.. జననాట్య మండలి ద్వారా గద్దర్, విమలక్క లాంటి వారితో గ్రామాల్లో తిరుగుతూ ప్రజలను చైతన్యవంతులను చేస్తూ వచ్చారు. గిరిజనులపై అటవీ అధికారుల దాష్టికం, ఆదివాసీలపై రాజకీయ నాయకులు.. వారికి సహకరిస్తూ పోలీసులు చేస్తున్న దౌర్జన్యాలపై సీతక్క కన్నెర్ర చేశారు.
Seethakka: నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ!
మావోయిస్టు జీవితం నుంచి లాయర్ గా మారి రాజకీయంలో తనదైన ముద్ర వేసుకొని నేడు మంత్రి స్థాయికి ఎదిగిన సీతక్క జీవితం ఎంతో మందికి ఆదర్శం. నక్సలైట్ నుంచి మినిస్టర్ వరకూ ఎదిగిన ఫైర్ బ్రాండ్ సీతక్క జర్నీ గురించి తెలుసుకోవాలనుకుంటే ఈ ఆర్టికల్ మొత్తం చదవండి.
Translate this News: