ఆదివాసీపై ఓ వ్యక్తి మూత్రం పోసిన ఘటన మధ్యప్రదేశ్ లో పెద్ద దుమారమే రేపింది. సిధి జిల్లాకు చెందిన నిందితుడు పర్వేజ్ శుక్లాను బుధవారం ఉదయం పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం నిందితుడిని ఇంటిని బుల్డోజర్లతో కూల్చివేశారు. అతని మీద ప్రభుత్వం జాతీయ భద్రతా చట్టంతోపాటు పలు ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసింది చౌహాన్ సర్కార్. అయితే పర్వేజ్ శుక్లా తమ పార్టీకి చెందినవాడంటూ వస్తున్న కథనాలను బీజేపీ తీవ్రంగా ఖండించింది.
పూర్తిగా చదవండి..ఆదివాసీపై మూత్రం పోసిన నిందితుడి ఇల్లు.. బుల్డోజర్తో కూల్చేసిన చౌహాన్ సర్కార్..!!
నేరస్తుల గుండెల్లో గుబులు పుట్టించే బుల్డోజర్ కల్చర్ యూపీ నుంచి మధ్యప్రదేశ్ కు వ్యాపించింది. ఆక్రమణదారులు, గ్యాంగ్ స్టర్లు, సంఘవ్యతిరేక కార్యాకలాపాలకు పాల్పుడుతున్న వారి పట్ల యూపీ సీఎం యోగిఆదిత్యనాథ్ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. నిందితులు ఆస్తులను బుల్డోజర్లతో నేటమట్టం చేస్తోన్న ఘటనలను ఇప్పటివరకు ఎన్నో చూశాం. ఈ కల్చర్ ఇప్పుడు మధ్యప్రదేశ్ కు పాకింది. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్ కూడా బుల్డోజర్ లను ఉపయోగిస్తూ నేరస్తులను భయభ్రాంతులకు గురిచేస్తున్నారు. అమానవీయ ఘటనలకు పాల్పడుతున్న వారి ఆస్తులను బుల్డోజర్ తో నేలమట్టం చేస్తున్నారు. ఇటీవల గిరిజనుడిపై ఓ వ్యక్తి మూత్రం పోసిన వీడియో దేశవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ ఘటనను చౌహన్ సర్కార్ సీరియస్ గా తీసుకుంది. నిందితుడి ఇంటిని బుల్డోజర్ తో నేలమట్టం చేసింది.
Translate this News: