యూపీలోని బలియా జిల్లా ఆసుపత్రిలో గత నాలుగు రోజుల్లో 57మంది మరణించారు. ఈ ఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగానే కాదు దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఈ మరణాలకు గల కారణాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. ఈ కమిటీ ఆదివారం లక్ నవూ నుంచి బలియా చేరుకుంది. వడదెబ్బ వల్లే 57 మరణించారా లేదా ఏదైనా ఇతర కారణాల వల్ల మరణించారా? అనే కోణంలో బలియా ప్రభుత్వాసుపత్రిలో కమిటీ దర్యాప్తు జరుపుతోంది.
పూర్తిగా చదవండి..వడదెబ్బ వల్లే ఆ 57 మంది మరణించారా? దర్యాప్తునకు సర్కార్ ఆదేశం..!!
ఉత్తరప్రదేశ్ లోని బలియా జిల్లా ఆసుపత్రిలో మూడు నాలుగు రోజుల్లో మొత్తం 57 మంది మరణించారు. ఇంత బారీ సంఖ్యలో మరణాలు నమోదు కావడంతో సర్కర్ అప్రమత్తమైంది. ఇద్దరు నిపుణులతో కూడిన కమిటిని నియమించింది. ఆసుపత్రిలో రోగులు వడదెబ్బ కారణంగా మరణించారని ఖచ్చితమైన ఆధారాలు లేవని కమిటిలోని ఒక సభ్యుడు ఏకే సింగ్ తెలిపారు. రోగుల మరణాలకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి ప్రభుత్వానికి రిపోర్టు అందిస్తామని చెప్పారు.
Translate this News: