News Click : న్యూస్‌క్లిక్‌తో చైనా లింకులు.. జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు.. అసలేం జరుగుతోంది?

న్యూస్ క్లిక్ (న్యూస్‌క్లిక్ జర్నలిస్ట్‌పై దాడి) నిధులకు సంబంధించి ED ఇప్పటికే దాడులు నిర్వహించింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, న్యూస్ క్లిక్‌లోని కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. న్యూస్ క్లిక్ అనేది మీడియా ఫ్లాట్ ఫామ్. దీన్ని 2009లో సంస్థ ఎడిటర్ ఇన్ చీఫ్ అయిన ప్రబీర్ పుర్కాయస్త స్థాపించారు. ఆన్ లైన్ న్యూస్ పోర్టల్ నేషనల్, ఇంటర్నేషనల్ న్యూస్ ను కవర్ చేస్తుంది.

News Click : న్యూస్‌క్లిక్‌తో చైనా లింకులు.. జర్నలిస్టుల ఇళ్లలో సోదాలు.. అసలేం జరుగుతోంది?
New Update

చైనా నుంచి నిధులు అందాయన్న ఆరోపణలపై న్యూస్ క్లిక్ అనే మీడియా సంస్థ కార్యాలయాలు, ఉద్యోగులు, జర్నలిస్టుల నివాసాలపై ఢిల్లీ పోలీసులు మంగళవారం సోదాలు నిర్వహించారు. ఢిల్లీ, నోయిడా, ఘజియాబాద్ లతో పెద్దెత్తున ఈ దాడులు నిర్వహించింది. ఈ సోదాల్లో ల్యాప్ టాప్ లు, మొబైల్ ఫోన్లతోపాటు పలు ఎలక్ట్రానిక్ వస్తువులను పోలీసులు ఆధారాల సేకరణ కోసం స్వాధీనం చేసుకున్నారు. యూఏపీఏ కింద కేసు నమోదు చేశారు. హార్డ్ డిస్క్ డేటాను కూడా పోలీసులు తీసుకున్నట్లు సమాచారం.

నిధులకు సంబంధించి న్యూస్ క్లిక్‌పై ED ఇప్పటికే దాడి చేసింది. ఈ వ్యవహారంలో మనీలాండరింగ్ కేసు నమోదు చేసిన ఈడీ, న్యూస్ క్లిక్‌లోని కొన్ని ఆస్తులను కూడా అటాచ్ చేసింది. ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ అధికారులు జర్నలిస్టుల స్థలాలపై సోదాలు చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఇప్పటి వరకు ఎవరినీ అరెస్టు చేయలేదు. కొందరు జర్నలిస్టులను విచారణ నిమిత్తం పోలీసు స్టేషన్‌లకు తరలించినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే ఈ న్యూస్ పోర్టల్‌పై కేసు నమోదు చేసి దాని నిధులపై విచారణ జరిపింది.

ఇది కూడా చదవండి: ఏపీలో తగ్గని వైసీపీ హవా…టైమ్స్ నౌ సంచలన సర్వే…వివరాలివే..!!

ఢిల్లీ పోలీసులు యూఏపీఏ కింద కేసు నమోదు చేసి.. జర్నలిస్టులపై సోదాలు చేపట్టారు. పోలీసు వర్గాల సమాచారం ప్రకారం..మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని తెలియజేస్తామని వెల్లడించారు. ఆగస్టు నెలలో, న్యూయార్క్ టైమ్స్ దర్యాప్తులో, అమెరికన్ మిలియనీర్‌తో లింక్ చేయబడిన నెట్‌వర్క్ ద్వారా లక్ష్యంగా చేసుకున్న సంస్థలలో న్యూస్‌క్లిక్ ఒకటి అని ఆరోపించారు. నెవిల్లే రాయ్ సింఘం.చైనా ప్రచారాన్ని ప్రోత్సహించే నిధులు సమకూర్చారనే ఆరోపణలు ఉన్నట్లు తెలిపారు.

2021లో ఢిల్లీ పోలీసుల ఆర్థిక నేరాల విభాగం దీనిపై కేసు నమోదు చేసినప్పుడు, న్యూస్ పోర్టల్, దాని నిధుల వనరులపై దర్యాప్తు చేపట్టింది.. ఈడీ కేసు కూడా ఇదే అంశంపై విచారణ జరుపుతోంది. ఢిల్లీ హైకోర్టు న్యూస్‌క్లిక్ ప్రమోటర్లకు అరెస్టు నుండి ఉపశమనం ఇచ్చింది. అప్పటి నుండి కేసు కోర్టులో ఉంది. 2021 సంవత్సరంలో, పన్ను ఎగవేత కేసులో ఆదాయపు పన్ను శాఖ అధికారులు న్యూస్ పోర్టల్ కార్యాలయాల్లో కూడా సోదాలు చేశారు. అయితే న్యూస్ క్లిన్ సంస్థ చైనాకు అనుకూలంగా స్పాన్సర్డ్ వార్తలను నడుపుతుందని ఆరోపణలు ఉన్నాయి. చైనా పౌరుడు నెవిల్ రాయ్ సింఘయ్ నుంచి 38కోట్లు తీసుకుని..భారత్ లో చైనా ప్రచారాన్ని వ్యాప్తి చేస్తున్నట్లు ఆ సంస్థపై ఆరోపణలుఉన్నాయి. కాగా ఢిల్లీ పోలీసులు సోదాలు జరిపినవారిలో న్యూస్ క్లిక్ జర్నలిస్టు అభిసార్ శర్మ కూడా ఉన్నారు. తాను ట్విట్టర్ లో సోదాల గురించి తెలిపారు.

ఇది కూడా చదవండి: దేశంలో మళ్లీ మోదీదే హవా…తగ్గేదేలేదు..!!

#delhi-police-special-cell #china-funding-allegations #abhisar-sharma #news-click
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి