Kurnool : నీ అంతు చూస్తా.. ZPTCని ఫోన్ చేసి బెదిరించిన మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు..!

మంత్రి జయరాంనే విమర్శిస్తావా.. నీ అంతు చూస్తా అంటూ.. కర్నూలు జిల్లా అస్పరీ ZPTC దొరబాబును ఫోన్ చేసి బెదిరించారు మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు నారాయణ. నోటికి వచ్చినట్లు దుర్భాషలాడారు. రెండు నెలలు ఆగు నిన్ను నరికేస్తామంటూ ఫోన్లో బెదిరించినట్లు తెలుస్తోంది.

Kurnool : నీ అంతు చూస్తా.. ZPTCని ఫోన్ చేసి బెదిరించిన మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు..!
New Update

Kurnool: కర్నూలు జిల్లా అస్పరీ ZPTC దొరబాబును ఫోన్ చేసి బెదిరించారు మంత్రి గుమ్మనూరు జరాయం సోదరుడు గుమ్మనూరు నారాయణ. మంత్రి జయరాంనే విమర్శిస్తావా నీ అంత చూస్తా అంటూ నోటికి వచ్చినట్లు దుర్భషలాడిన ఆడియో ఇప్పుడు వైరల్ గా మారింది. రెండు నెలలు ఆగు నిన్ను నరికేస్తామంటూ ఫోన్లో బెదిరింపులకు దిగినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ వైసీపీ  ZPTC దొరబాబుపై బూతులతో రెచ్చిపోయాడు మంత్రి సోదరుడు.

Also Read: కడప జిల్లాలో వైసీపీ ఎంపీటీసీ భర్త దౌర్జన్యం.. టోల్‍గేట్ సిబ్బందిపై దాడి..!

మంత్రి జయరాంనే విమర్శించేంత వాళ్లా మీరు అంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అయితే, తాను మంత్రి గురించి ఒక్క మాట కూడా ఎత్తలేదని చెప్పినప్పటికి  గుమ్మనూరు నారాయణ ఏ మాత్రం వినిపించుకోలేదని ఆడియోలో అర్థం అవుతుంది. గతంలో నిన్ను వేరే వాళ్లతో నరికించేయాల్సింది కానీ, ఏమోలే అని నేనే అడ్డుకున్నాను..అలాంటిది నువ్వు మంత్రిని విమర్శిస్తావా? అంటూ దొరబాబుపై నిప్పులు చెరిగారు.

Also Read: షేర్ మార్కెట్ లో అప్పులు… మహిళను హత్య చేసిన నిందితుడు అరెస్ట్..!

గుమ్మనూరు నారాయణకు తాను మంత్రి గురించి ఏమీ అనలేదని మొరపెట్టుకున్న వినిపించుకోకపోవడంతో  దొరబాబు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీరియస్ అయిన ZPTC ఈ విషయంను వైసీపీ అధిష్టానంతో పాటు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేయనున్నట్లు సమచారం. సొంత పార్టీ నేతలపై ఇలా వార్నింగ్ చేయడం ఏంటని పలువురు నేతలు ఫైర్ అవుతున్నారు.

#andhra-pradesh
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe