TG EAMCET 2024: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత లేట్.. కారణమిదే!

తెలంగాణలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపినప్పటికీ ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సమాచారం.

TG EAMCET 2024: తెలంగాణలో ఇంజనీరింగ్ కౌన్సెలింగ్ మరింత లేట్.. కారణమిదే!
New Update

TG EAMCET Counselling: తెలంగాణలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. జూన్ 27 నుంచి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని ఇప్పటికే రాష్ట్ర ఉన్నత విద్యా మండలి తెలిపినప్పటికీ ఇంజనీరింగ్‌ కాలేజీలకు అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) నుంచి ఎలాంటి సమాచారం రాలేదని సమాచారం. అంతేకా కౌన్సిలింగ్ ప్రక్రియ కూడా మొదలు కానట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

2024–25 విద్యా సంవత్సరం మొదలు..

ఈ మేరకు మరికొన్ని రోజుల్లో 2024–25 విద్యా సంవత్సరం మొదలవనుండగా ఇదుకు సంబంధించిన క్యాలెండర్‌ను ఏఐసీటీఈ ప్రకటించింది. ఈ క్యాలెండర్ ప్రకారం జూన్‌ 10వ తేదీకల్లా అన్ని కాలేజీలకు అనుమతినివ్వాల్సి ఉంటుంది. నిబంధనలకు అనుగుణంగా మౌలిక వసతులు, ఫ్యాకల్టీ ఏర్పాటు చేసుకునే కాలేజీలకే అనుమతి లభించనుండగా.. నిర్దేశించిన సమయంలో అనుమతి రాలేని కాలేజీలకు మరోసారి దరఖాస్తు చేసుకునే ఛాన్స్ ఉంటుంది. ఈ ప్రక్రియను జూన్‌ 30 నాటికి ముగించాల్సి ఉండగా.. రాష్ట్రంలోని కాలేజీలు ఏఐసీటీఈ అనుమతి కోసం దరఖాస్తు చేసుకున్నాయి.

అనుమతి లభించడం కష్టమనే అనుమానాలు..

అయితే ప్రస్తుత పరిస్థితి గమనిస్తే జూన్‌ 10 వరకు అనుమతి లభించడం కష్టమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జాతీయ స్థాయిలో విద్యా విధానంలో అనేక మార్పులు చోటుచేసుకుంటుండగా.. అంతర్జాతీయ స్థాయిలో ఉన్నట్టు భారత్‌లోనూ క్రెడిట్‌ విధానం అందుబాటులోకి తేవాలని నిర్ణయించారు. 10వ తరగతి వరకూ కొన్ని క్రెడిట్స్, ఇంటర్‌ తర్వాత కొన్ని, డిప్లొమా కోర్సులకు, ఇంజనీరింగ్‌ కోర్సులకు క్రెడిట్స్‌ విధానం తీసుకొస్తున్నారు. ఈ క్రమంలో అన్ని ప్రొఫెషనల్‌ కోర్సులను ఏఐసీటీఈ పరిధిలో చేరుస్తున్నారు. ఇప్పటివరకూ బీబీఏ, బీసీఏ, బీఎంఎస్‌ వంటి కోర్సులు యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ పరిధిలో ఉండేవి. తాజాగా ఏఐసీటీఈ పరిధిలోకి తెస్తూ అన్ని కోర్సులకు కలిపి ఒకే దరఖాస్తు విధానం తీసుకొచ్చారు. అంటే బీబీఏ, బీసీఏ, బీఎంఎస్‌ కోర్సులతో పాటు ఇంజనీరింగ్‌ కోర్సులు కూడా ఇదే దరఖాస్తు విధానంలోకి వచ్చాయన్న మాట. ఈ మేరకు అవసరమైన సాఫ్ట్‌వేర్‌ రూపొందించడానికి కాస్త సమయం పట్టే అవకాశం కనిపిస్తోంది.

ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ, కేంద్ర ఇంజనీరింగ్‌ కాలేజీల్లో ప్రవేశానికి వచ్చే నెలలో కౌన్సెలింగ్‌ మొదలవుతుంది. ఇప్పటికే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష పూర్తికాగా.. త్వరలో జోసా (జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ) కౌన్సెలింగ్‌ తేదీలనూ ప్రకటించే అవకాశం ఉంది. ఇది ఆరు దశలుగా ఉంటుంది. జోసా కౌన్సెలింగ్‌ చివరి తేదీని బట్టి రాష్ట్రంలో ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ చివరి దశ చేపడతారు. విద్యార్థులు తొలి దశలో రాష్ట్ర కాలేజీల్లో చేరి, చివరి దశలో జాతీయ కాలేజీల్లోకి వెళ్తారు. ఇలా ఖాళీ అయిన సీట్లను చివరి దశలో భర్తీ చేస్తారు. కానీ కాలేజీలకు ఏఐసీటీఈ అనుమతి ఇప్పటికీ రాకపోవడంతో రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ ఎప్పుడు పూర్తవుతుందనే దానిపై స్పష్టత రావడం లేదని అధికార వర్గాలు అంటున్నాయి. రాష్ట్ర ఇంజనీరింగ్‌ కౌన్సెలింగ్‌ నిర్ణయించిన తేదీల్లోనే కొనసాగుతుంది. ఈలోగా ఏఐసీటీఈ అనుమతి వస్తుందని ఆశిస్తున్నట్లు ఉన్నత విద్య మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి తెలిపారు.

#tg-eamcet-2024 #ts-eamcet-2024
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe