జమ్మూ కాశ్మీర్లోని (Jammu and Kashmir)పూంచ్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో మంగళవారం నలుగురు ఉగ్రవాదులను (Terrorists) భద్రతా బలగాలు హతమార్చాయి . సోమవారం రాత్రి సురన్కోట్లోని సింధారా టాప్ ప్రాంతంలో సైన్యం, జమ్మూ పోలీసులు సంయుక్త ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం ఎన్కౌంటర్ జరిగిందని అధికారులు తెలిపారు. మంగళవారం ఉదయం 5 గంటలకు ఎన్కౌంటర్ తిరిగి ప్రారంభమైందని, ఇందులో నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారని జమ్మూ జోన్ అదనపు డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ) ముఖేష్ సింగ్ తెలిపారు.
పూర్తిగా చదవండి..Terror Attack Foiled in Jammu : జమ్మూలో ఉగ్రకుట్న భగ్నం..నలుగురు టెర్రరిస్టులను మట్టుబెట్టిన ఆర్మీ..!!
జమ్మూకశ్మీర్లో (Jammu and Kashmir) భారీ ఉగ్రకుట్రను భగ్నం చేశాయి భద్రతా బలగాలు. పూంచ్ సెక్టార్ లోకి నలుగురు విదేశీ ఉగ్రవాదులు చొరబడేందుకు ప్రయత్నించగా సైన్యం వారిని మట్టుబెట్టాయి. జూలై 16.17 మధ్య రాత్రి పూంచ్ లో నియంత్రణ రేఖ వెంబడి సైన్యం చొరబాటు ప్రయత్నాన్ని అడ్డుకున్నాయి. ఒక రోజు తర్వాత జరిగిన ఈ ఎన్ కౌంటర్లలో నలుగురు టెర్రరిస్టులను హతమార్చింది సైన్యం.
Translate this News: