/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/atp-1-1.jpg)
Ananthapur: అనంతపురం జిల్లా నేమకల్లులో ఆందోళన పరిస్థితి నెలకొంది. పరిశ్రమల యాజమాన్యం, రైతన్నలకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. నేమకల్లు గ్రామంలో పరిశ్రమల నుండి వస్తున్న డస్ట్ వల్ల నష్టపోతున్నామని రైతన్నలు పొల్యూషన్ అధికారులను ఆశ్రయించారు. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. దీంతో పొల్యూషన్ కంట్రోల్ అధికారులు పంట పొలాలను పరిశీలించారు. ఫ్యాక్టరీ యాజమాన్యం జిఎంలు పంట పొలాలకు రావడంతో రైతన్నలు, సిపిఐ ఏపీ రైతు సంఘం నాయకులు వారిని నిలదీయగా ఘర్షణ చోటుచేసుకుంది.