అయితే కేటీఆర్ కొడుకు హిమాన్షు ఒక ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకొని సుమారు కోటి రూపాయలతో కార్పొరేట్ స్థాయిలో స్కూల్ని చక్కగా తీర్చిదిద్దాడు. ప్రస్తుతం ఆ స్కూలుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు. పూర్తి వివరాలు లోకి వెళితే.. ఒక ప్రైవేట్ స్కూల్లో చదివే అటువంటి హిమాన్షు ఆ స్కూల్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గచ్చిబౌలి కేశవనగర్ లో ప్రాథమిక పాఠశాలను ఆయన సందర్శించి నాకు మా తాతగారు ఆదర్శం అంటూ అందరిని ఆశ్చర్యపరిచాడు.
పూర్తిగా చదవండి..సీఎం కేసీఆర్ మనువడు హిమాన్ష్ ఎమోషనల్ స్పీచ్
సీఎం కెసిఆర్ మనవడు హిమాన్షు ఈ మధ్యకాలంలో ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నాడు. చదువులో ముందు ఉండడమే కాకుండా, పలు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రాంలను ఏర్పాటు చేస్తూ, అందులో ఆయన పాల్గొంటూ మిగతా విద్యార్థులకు భరోసాను ఇవ్వడం లాంటివి చేస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తున్నాడు. అయితే హిమాన్షు మరో ముందడుగు వేసి తన గొప్ప మనసును చాటుకున్నాడు. తాతకు తగ్గ మనవడిగా ప్రశంసలు పొందుతున్నాడు.
Translate this News: