ఏ సినిమా తీసుకున్నా సరే, సినిమాలో పాటలు కీ రోల్ ప్లే చేస్తాయి. ఒకవేళ అవి లేకపోతే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ అయినా ఖచ్చితంగా ఉంటుంది. ప్రస్తుతం దక్షిణాదిలో టాప్ సింగర్ అయిన సిద్ శ్రీరామ్.. ఒక్కో పాట కోసం 4 లక్షల వరకు తీసుకుంటాడట. మిగతా సింగర్స్ చాలా వరకు, లక్ష లోపే రెమ్యురనేషన్ తీసుకుంటుంటారు. సౌత్ లో ఏమో గానీ బాలీవుడ్ లో మాత్రం సింగర్స్ కి లక్షల్లో ఇస్తుంటారు.
సింగిల్ పాటకు రూ.3 కోట్లు
ప్రస్తుతం.. దేశవ్యాప్తంగా ఉన్న సింగర్స్ లో ఆస్కార్ విన్నర్ ప్రపంచాన్ని తన మ్యూజిక్తో మతిపోగొట్టే సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ఖచ్చితంగా టాప్ లో ఉంటాడు. ఆయన సంగీత దర్శకుడు అయినప్పటికీ.. అప్పుడప్పుడు సాంగ్స్ కూడా పాడుతూ కుర్రకారును ఉర్రూతలు ఊగిస్తాడు. అలా రెహమాన్ ఒక్కో పాట కోసం 3 కోట్ల వరకు ఛార్జ్ చేస్తాడట. కొన్నిసార్లు అయితే పాటను బట్టి 5 కోట్లు వరకు రెమ్యూనరేషన్ ఉంటుందని అంటున్నారు. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది.
ఈ సింగర్స్ కూడా కాస్ట్లీ!
రెహమాన్ తర్వాత నెక్స్ట్ ఎవరనేది చూసుకుంటే.. స్టార్ ఫిమేల్ సింగర్ శ్రేయా ఘోషల్ తాను పాడే ఒక్కో పాట కోసం 25 లక్షల వరకు తీసుకుంటుందట. ఇలా ఒక్కొక్కరిగా చూసుకుంటే వరుసగా సునిధి చౌహాన్, అర్జిత్ సింగ్.. 20 నుంచి 22 లక్షల వరకు ఛార్జ్ చేస్తారట. సోనూ నిగమ్, బాద్ షా అయితే 18 నుంచి 20 లక్షల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటారని టాక్. మిగతా వారిలో షాన్, నేహా కక్కర్, మికా సింగ్, హనీ సింగ్ 10 లక్షల వరకు డిమాండ్ చేస్తున్నారని ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది.