పాపం నా పేరు లేకుండా వాళ్లు బతకలేరేమో? అనసూయ హాట్‌ ట్వీట్‌..

బుల్లితెర యాంకర్‌గా, నటిగా, క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌గా టాలీవుడ్ ప్రేక్షకుల్లో మంచిపేరు సంపాదించుకుంది అనసూయ భరద్వాజ్. ఇటీవలే విమానం సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి సందడి చేసింది. రంగస్థలం, పుష్ప సినిమాలతో మరింత ఫేమ్ తెచ్చుకున్న అనసూయ ఇటీవల తరచుగా వార్తల్లో నిలుస్తోంది. తాజాగా ఆమె చేసిన ట్వీట్ సోషల్ మీడియాలో మరోసారి వైరల్‌గా మారింది.

పాపం నా పేరు లేకుండా వాళ్లు బతకలేరేమో? అనసూయ హాట్‌ ట్వీట్‌..
New Update

ఇటీవలే తనను వివాదాల్లోకి లాగొద్దంటూ అనసూయ సోషల్ మీడియాలో విజ్ఞప్తి చేసిన సంగతి తెలిసిందే. తాజాగా ట్వీట్‌లో రాస్తూ..'వావ్! నేను నిజంగా చాలా చాలా ముఖ్యమైన వ్యక్తిని. నా పరిచయం ఉన్నా లేకున్నా.. నాకు సంబంధం ఉన్నా.. లేకున్నా.. నా పేరు ఎత్తకుండా ఒక్క చర్చ కూడా జరగడం లేదంటే.. మీ అందరికి నేను అంతలా కావాలి అబ్బాయిలు.. నాపైనే ఎక్కువగా మీరంతా ఆధారపడి ఉన్నారు. నా పేరు లేకుండా పాపం ఏదీ చెప్పలేక పోతున్నారు.' అంటూ ఎమోజీని జత చేసింది.

అనసూయకు ఏమైందంటూ కామెంట్లు

ఇది చూసిన అభిమానులు అనసూయ మళ్లీ నీకు ఏమైందంటూ కామెంట్లు చేస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇప్పటికే గతంలోనూ అనసూయ చాలాసార్లు ట్వీట్స్ వివాదాలకు దారి తీసిన సంగతి మనందరికి తెలిసిందే. కాగా.. తాజాగా.. ఓ హీరో కొత్త సినిమా పోస్టర్‌ రిలీజ్ చేయగా దానిపై అభిప్రాయం వ్యక్తం చేసిన అనసూయకు ఆ హీరో ఫ్యాన్స్‌ నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు ఎదురయ్యాయి. గతంలో హీరో విజయ్ దేవరకొండ తనను టార్గెట్‌ చేశారని కావాలనే తనపై కొందరికి డబ్బులిచ్చి మరీ ట్రోల్స్ చేస్తున్నారని ఆరోపించింది.

ఆంటీ అనడంతో అనసూయ ఫైర్

అయితే గతంలోనూ సోషల్‌మీడియా వేదికగా తనని చాలామంది ఆంటీ అనడంతో అనసూయ ఫైర్ అయ్యింది. ఇలా చాలామంది ఆమెకు చివాట్లు పెడుతూ ఏందమ్మా.. అనసూయ నీ నసంటూ నెటిజన్లు ఫైర్ అయ్యారు. తన హాట్‌హాట్ అందాలతో సోషల్‌మీడియాలో ఫోటోలు షేర్ చేయడం ఎందుకు మళ్లీ సీరియస్ అవడం ఎందుకు అంటూ యువత తమ కామెంట్లతో అనసూయను ప్రశ్నించారు.

#NULL
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe