ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి అనే పదం వినగానే తన పెదవిపై చెరగని స్వచ్ఛమైన చిరునవ్వు మన కళ్ల ముందు ఇప్పటికి సాక్షాత్కరిస్తుంది. నమస్తే అక్కయ్యా.. నమస్తే చెల్లెమ్మా.. నమస్తే తమ్ముడూ.. అంటూ ఆప్యాయంగా పిలిచే పిలుపు మన చెవుల్లో ఇప్పటికి, ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటుంది. ప్రజల సంక్షేమం, రాష్ట్ర సమగ్రాభివృద్ధిలో వైఎస్ రాజశేఖర్రెడ్డి ఒక అడుగు వేసి ఉమ్మడి రాష్ట్రాన్ని ప్రగతిపథంలో నడిపించారు.
పూర్తిగా చదవండి..వైఎస్సార్ జయంతి సందర్భంగా సీఎం జగన్ ఎమోషనల్ ట్వీట్
నేడు ఉమ్మడి ఏపీ మాజీ సీఎం దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి 74వ జయంతి సందర్భంగా కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్ద విజయమ్మ, షర్మిల నివాళులర్పించారు. వైఎస్ఆర్ ఘాట్ వద్ద షర్మిల ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. ఏపీ సీఎం వైఎస్ జగన్ తన తండ్రి వైఎస్సార్ను గుర్తు చేసుకుంటూ తన ట్విట్టర్ ఖాతాలో భావోద్వేగ ట్వీట్ చేశారు.
Translate this News: