హీరోయిన్ ప్రణీత గురించి టాలీవుడ్ ఆడియెన్స్కి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు.‘ఏం పిల్లో.. ఏం పిల్లడో’మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మా.. ఆకట్టుకునే తన కళ్లు, అందచందాలతో తొలి మూవీతోనే మంచి ఐడెంటీటీని తెచ్చుకుంది. ‘రభస’, ‘డైనమైట్’, ‘అత్తారింటికి దారేది’లాంటి పలు చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మంచి గుర్తింపు తెచ్చుకుంది. కెరీర్ పీక్స్లో ఉండగానే 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజును పెళ్లి చేసుకొని సినిమాలకు గుడ్బై చెప్పింది. గతేడాది ఓ పాపకు జన్మనిచ్చింది.
పూర్తిగా చదవండి..పతికి పాదపూజ చేసి, విమర్శకులకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన హీరోయిన్
హీరోయిన్ ప్రణీత సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ.. సోషల్ మీడియా ద్వారా మాత్రం ఎప్పుడు అభిమానులతో సందడి చేస్తూ టచ్లోనే ఉంటుంది. తాజాగా.. ప్రణీత తన భర్తకు పాదపూజ చేస్తున్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా..అవి కాస్త వైరల్ అయ్యాయి. కొంతమంది నెటిజన్స్ ఆమెను విమర్శిస్తూ నెగెటివ్ కామెంట్స్ పెడుతున్నారు. అలాంటి వారికి ప్రణీత గట్టి కౌంటర్ ఇస్తూ ఫోటోలు షేర్ చేసింది.
Translate this News: