దర్శకేంద్రుడి పుత్రుడితో జక్కన్న మూవీ, ఎందుకు మిస్సయ్యిందంటే..?

రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువనే చెప్పాలి. ఎందుకంటే టాలీవుడ్‌ ఖ్యాతిని అంతర్జాతీయస్థాయికి పెంచి టాలీవుడ్​కు బ్రాండ్‌ అంబాసిడర్​గా మారిపోయారు. అయితే సంచలన చిత్రాలతో దూసుకుపోతున్న జక్కన్న తనకు దర్శకత్వ పాఠాలు నేర్పిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు తనయుడితో డైరెక్టర్‌ రాజమౌళి​ మూవీ చేయాలని భావించారట. కానీ కొన్ని పరిస్ధితుల వల్ల అది కుదరలేదట.

New Update
దర్శకేంద్రుడి పుత్రుడితో జక్కన్న మూవీ, ఎందుకు మిస్సయ్యిందంటే..?

telugu-movie-rajamouli-director-raghavendra-rao-son-prakash-kovela-mudi-missed-the-chace-work-with-rajamouli-first-movie2

సంచలనాలకు కేరాఫ్ అడ్రస్ జక్కన్న డైరెక్షన్​లో నటించాలని ప్రతి ఒక్క నటుడు కోరుకుంటారు. అవకాశమొస్తే స్టోరీ వినకుండా ఓకే చెప్పడానికి రెడీగా ఉంటారు. మరి అంతటి గొప్ప దర్శకుడైన రాజమౌళి.. దర్శకత్వ పాఠాలు నేర్చుకుంది దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గరని తెలుసుగా.. దీంతో తన కెరీర్​ స్టార్టింగ్‌లో జక్కన్నకు ఓ మంచి ఛాన్స్ దక్కింది. ఏంటంటే.. తన గురువైన రాఘవేంద్రరావు తనయుడు ప్రకాశ్‌ కోవెలమూడిని డైరెక్ట్‌ చేసే ఛాన్స్​ ఉండే.. కానీ అది ఆ తర్వాత అనుకోని కారణాల వల్ల ఆగిపోయింది.

telugu-movie-rajamouli-director-raghavendra-rao-son-prakash-kovela-mudi-missed-the-chace-work-with-rajamouli-first-movie12

ఎలా అంటే.. రాజమౌళి, జూనియర్​ ఎన్టీఆర్‌ హీరోగా నటించిన తొలి సినిమా 'స్టూడెంట్‌ నెం.1' డైరెక్ట్ చేసి ఈ చిత్రంతో దర్శకుడిగా మారారు. ఆ సినిమా బాక్సాఫీస్‌ వద్ద గ్రాండ్ సక్సెస్​ను అందుకుంది. దీంతో రాజమౌళి దర్శకత్వంలో ప్రకాశ్‌ కోవెలమూడి హీరోగా ఓ సినిమా చేయాలని గ్రాండ్​గా ప్లాన్​ చేశారు. దీనికి సంబంధించి స్టోరీ డిస్కషన్స్​ జరిగాయట. ఈ చిత్రానికి 'విజయ సింహ' అనే టైటిల్ ఖరారు చేశారు. అదితి అగర్వాల్‌ను హీరోయిన్​గా సెలెక్ట్ చేశారు. దాదాపు నాలుగు నెలల పాటు.. స్క్రిప్ట్‌ వర్క్​ చేశారు. కానీ ఏమైందో తెలీదు కానీ ఆ సినిమా ఆగిపోయింది. చిత్రం సెట్స్​పైకి వెళ్లలేదు. దీంతో సినిమా మధ్యలో ఆగిపోవడంతో.. ప్రకాశ్​ మరో డైరెక్టర్​ చేతిపై నుంచి లాంఛ్ అయ్యారు. జాన్‌ మహేంద్రన్‌ దర్శకత్వంలో 'నీతో' చిత్రం ద్వారా హీరోగా సిల్వర్​ స్క్రీన్ ఎంట్రీ ఇచ్చారు. అదే సమయంలో దర్శకుడు రాజమౌళి 'సింహాద్రి' అనే చిత్రం తెరకెక్కించి మరో బ్లాక్​బాస్టర్​ హిట్​ను అందుకున్నారు.

మళ్లీ కలిసి పనిచేయలేదు.. ఆ తర్వాత మళ్లీ రాజమౌళి- ప్రకాశ్‌ వేర్వేరు కలిసి పని చేసే అవకాశం కూడా రాలేదు. ఇద్దరు వేర్వేరు రూట్లలో ముందుకు సాగుతున్నారు. అయితే నటుడిగా కెరీర్‌ ప్రారంభించిన ప్రకాశ్‌.. కొంతకాలానికి డైరెక్టర్​గా మారారు. 'బొమ్మలాట', 'అనగనగా ఓ ధీరుడు', 'సైజ్‌ జీరో' సహా పలు చిత్రాలకు దర్శకత్వం వహించారు. 2019లో బాలీవుడ్ భామ కంగనా రనౌత్‌తో కలిసి 'జడ్జిమెంటల్‌ హై క్యా' అనే చిత్రాన్ని తీశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు