ఇప్పుడంతా ‘ఆర్టిఫిషియల్ మాయా’ లోకం..! భవిష్యత్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్దేనని..మనుషులతో పని ఉండదని..ఉద్యోగాలు ఊడిపోతాయని సర్వత్రా చర్చ జరుగుతోంది. చాలా స్టార్టప్ కంపెనీలు ఉద్యోగుల స్థానంలో చాట్బాట్లను ఉపయోగించుకుంటున్నాయి. ఇదంతా నిజమే కావొచ్చు..టెక్ కంపెనీలు అలా చేస్తున్నట్టు చాలా ఫ్రూఫ్లు కూడా ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ ట్రెండ్ మీడియా ఫీల్డ్లోనూ స్టార్ట్ అయ్యింది. కొన్ని న్యూస్ ఛానెల్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో యాంకర్లను తయారు చేశాయి. ఈ వర్చువల్ యాంకర్లను పరిచయం చేసిన వాళ్లలో తెలుగు, కన్నడ, ఒరియా న్యూస్ ఛానెల్స్ ఉన్నాయి. ఈ ఏఐ యాంకర్ల రాకతో రియల్ న్యూస్ రీడర్లకు భయం పట్టుకుందన్న ప్రచారం జరుగుతోంది. అయితే ఇందులో అసలు నిజమెంతా..? న్యూస్ రీడర్లు అంతలా భయపడాల్సిన అవసరం ఉందా..?
పూర్తిగా చదవండి..AI Anchors: ఏఐ న్యూస్ యాంకర్లతో రియల్ యాంకర్లకు ముప్పు ఉందా..? ఇందులో నిజమెంతా..?
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యాంకర్లతో రియల్ యాంకర్లు భయపడాల్సిన పని లేదని తెలుస్తోంది. ఎందుకంటే ఓ వార్తను ఎమోషన్ క్యారీ చేస్తూ చదవడం వేరు.. యాంత్రికంగా చదవడం వేరు. ఇటివల ఏఐతో పని చేసే న్యూస్ రీడర్లను ఒరియా, కన్నడ, తెలుగులో కొన్ని ఛానెల్స్ పరిచయం చేయగా..వాటి గురించి రియల్ యాంకర్లు టెన్షన్ పడాల్సిన అవసరంలేదని నిపుణులు చెబుతున్నారు.
Translate this News: