మూసీపై వెనక్కి తగ్గేదే లేదు.. సీఎం రేవంత్ సంచలనం

TG: మూసీపై వెనక్కి తగ్గేదే లేదని తేల్చి చెప్పారు సీఎం రేవంత్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన మూసీ మురికిని ప్రక్షాళన జరుగుతుందని అన్నారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు.

Telangana Government CM Revanth Reddy
New Update

CM Revanth Reddy: ఉద్యోగ నియామక పత్రాల పంపిణీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడారు. వివిధ శాఖలకు సంబంధించి నోటిఫికేషన్లు ఇచ్చిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వడం బాధ్యతగా భావించలేదని అన్నారు. ఉద్యోగాల కోసం నిరీక్షించి నిరీక్షించి 
ప్రభుత్వంపై విశ్వాసం కోల్పోయే పరిస్థితి నెలకొందని చెప్పారు.

ALSO READ: ఇరాన్‌ను భారీ దెబ్బ తీసిన ఇజ్రాయెల్

మమ్మల్ని గెలిపించింది నిరుద్యోగులే...

నిరుద్యోగ జంగ్ సైరన్ మోగించిన నాడు.. వాళ్ల ఉద్యోగాలు ఊడితేనే మీకు ఉద్యోగాలు వస్తాయని తాను చెప్పానని..  తన మాటపై నమ్మకం ఉంచి కాంగ్రెస్ ను గెలిపించారని నిరుద్యోగులపై ప్రసంశలు కురిపించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడగానే 90రోజుల్లోనే ప్రమాణ స్వీకారం చేసిన చోటే 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందించినట్లు చెప్పారు. దసరా పండగ నేపథ్యంలో తెలంగాణలో ప్రతీ కుటుంబంలో ఆనందం చూడాలని ఇవాళ మరిన్ని నియామక పత్రాలు అందిస్తున్నట్లు తెలిపారు.

వందలాది మంది ఆత్మబలిదానాలతో...

1635 మందికి ఇవాళ ఉద్యోగ నియామక పత్రాలు అందించడం సంతోషంగా ఉందని అన్నారు. మీ చప్పట్లలో మీ సంతోషం, మీ కుటుంబ సభ్యుల ఆనందం కనిపిస్తుందని చెప్పారు. ఏళ్లుగా నిరీక్షించిన మీ కల ఇవాళ సాకారమవుతోందని అన్నారు. వందలాది మంది ఆత్మబలిదానాలతో తెలంగాణ ఏర్పడింది. అలాంటి తెలంగాణ పునర్నిర్మాణంలో మీరు భాగస్వాములు కాబోతున్నారని అన్నారు. ఉద్యోగ నిర్వహణలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని చెప్పారు.

ఎవరిని ఆదర్శంగా తీసుకుంటారో...

లక్షలాది మంది హైదరాబాద్ ప్రజల దాహార్తిని తీర్చిన మోక్షగుండం విశ్వేశ్వరయ్య లాంటి ఇంజనీర్లను మీరు ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు సీఎం. హైదరాబాద్ లో వందల ఏళ్ల క్రితం నిర్మించిన అద్భుత కట్టడాలున్నాయని అన్నారు. వందేళ్ల అనుభవం ఒకవైపు.. పదేళ్ల దుర్మార్గం మరోవైపు.. కాళేశ్వరం కట్టినవారిని ఆదర్శంగా తీసుకుంటారో... నాగార్జున సాగర్ కట్టిన వారిని ఆదర్శంగా తీసుకుంటారో ఆలోచించుకోండి అని చెప్పారు.

అక్టోబర్ 9న BE READY...

తన కుటుంబ సభ్యులకు ఉద్యోగాలు ఇచుకున్న కేసీఆర్ ... 2015లో నోటిఫికేషన్లు ఇచ్చిన వాళ్ళకు ఎందుకు ఉద్యోగాలు ఇవ్వలేదు? అని నిలదీశారు. తెలంగాణ ఉద్యమం గొప్పతనాన్ని.. విద్యార్థి నిరుద్యోగుల త్యాగాలను కేసీఆర్ కవచంగా మార్చుకున్నారని ఫైర్ అయ్యారు. ఇవాళ ముసుగు తొలగిపోవడంతో ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. అక్టోబర్ 9న 11,063 ఉపాధ్యాయ నియామక పత్రాలు అందించబోతున్నామని కీలక ప్రకటన చేశారు.

మూసీపై వెనక్కి తగ్గేదే లేదు..

మూసీ మురికిని ప్రక్షాళన చేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు సీఎం రేవంత్. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా మీ చేతుల మీదుగా మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ జరగబోతుందని తేల్చి చెప్పారు. మూసీ పరివాహక ప్రాంతాల ప్రజలు మూసీ కంపులోనే బ్రతకాలా? అని ప్రతిపక్షాలను నిలదీశారు. మూసీ పరివాహక  ప్రజలకు ఇండ్లు కట్టించి వారికి మంచి భవిష్యత్తును అందిద్దాం అని అన్నారు. ప్రతీదానికి అడ్డుపడటం కాదు.. మూసీ బాధితులను ఎలా ఆదుకుందామో సలహాలు ఇవ్వాలని సూచించారు. 

ఈటల అంగి మారింది...

బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అంగి మారింది కానీ.. వాసన మారలేదని సెటైర్లు వేశారు సీఎం రేవంత్ రెడ్డి. హరీష్, కేటీఆర్ మాట్లాడిందే ఈటల మాట్లాడుతున్నారని అన్నారు. ఈటల ఇప్పటికైనా పేదల వైపు నిలబడాలని.. ఇలా వచ్చి అలా వెళ్లడం కాదు... ధైర్యం ఉంటే కేసీఆర్, హరీష్, ఈటల మూసీ పరివాహక నివాసాల్లో వారం రోజులు ఉండలని అన్నారు. అప్పుడే వాళ్ల కష్టాలు, బాధలు తెలుస్తాయన్నారు.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe