Indravelli : ఇంద్రవెల్లి అమర ఆదివాసీల అసువులు బాసిన దినం!

ఈనెల 20 న ఇంద్రవెల్లి లో ఆదివాసీల పై కాల్పులు జరిగి పదుల సంఖ్యలో మరణించిన దినం! వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై రైతుకూలీసంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు సమావేశం నిర్వహించింది. సమావేశంపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.

New Update
 Indervelly

Indervelly

Indravelli : ఈనెల 20 న ఇంద్రవెల్లి లో ఆదివాసీల పై కాల్పులు జరిగి పదుల సంఖ్యలో  మరణించిన దినం! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆదివాసీలకు రక్షణ కల్పిస్తూ ఆంధ్రప్రదేశ్ (షెడ్యూల్ ప్రాంతం) భూమి బదలాయింపు చట్టం -1959 వచ్చింది. దీనికి 1970లో మార్పులు చేశారు. దీనినే 1/70 చట్టంగా పిలుస్తారు. దీని ప్రకారం ఏజెన్సీ ప్రాంతాల్లో గిరిజనేతరులకు భూ బదలాయింపులు (అమ్మకం, కౌలు, గిఫ్ట్) చెల్లకుండా చర్యలు చేపట్టారు. అడవిపై ఆదివాసీలకే హక్కు ఉండాలని ఈ చట్టం చెబుతోంది. ఆదివాసీ గిరిజనుల సంస్కృతిని, సాంప్రదాయాలను పరిరక్షించడం అంతరించిపోతున్న ఆదివాసీ తెగలను కాపాడడం కోసం 1/70 చట్టాన్ని తీసుకొచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినప్పటికీ పెద్ద ఎత్తున ఆదివాసీల భూములు అన్యాక్రాంతం అయ్యాయి. ఈ పరిణామాల తర్వాతే ఇంద్రవెల్లి సంఘటనకు దారి తీసింది. 

అది ఏప్రిల్ 20,1981వలసదారుల దోపిడీ నిరాటంకంగా కొనసాగడం, భూముల అన్యాక్రాంతం, ఫారెస్ట్, రెవెన్యూ, పోలీస్ శాఖల ప్రాబల్యం పెరగడం వలన, జీవనాధారమైన భూములు, పుట్టిన ప్రాంతంలోనే తమ అస్తిత్వం అన్యాక్రాంతం అయ్యాయి. వ్యాపారుల దోపిడీ, కూలీ రేట్లు, అటవీ భూములు లాంటి అంశాలపై గిరిజన రైతుకూలీ సంఘం ఇంద్రవెల్లిలో ఏప్రిల్ 20, 1981 నాడు ఒక సమావేశానికి పిలుపు నిచ్చింది. మొదలు సభను ప్రభుత్వం పెద్దగా పట్టించుకోలేదు. ఆదివాసుల నుంచి వస్తున్న స్పందనను చూసి సభపై నిషేధం విధించారు. ఈ విషయం తెలియని ఆదివాసులు జన సంద్రమై అడవిని దాటుకొని ప్రవాహంలా ఇంద్రవెల్లికి వచ్చారు. అడ్డుకునేందుకు పోలీస్ బలగాలు అడవుల్లో దిగాయి. వేలాదిగా వస్తున్న నిరాయుధులైన ఆదివాసులపై పోలీసులు తూటాల వర్షం కురిపించారు.ఆదివాసీలు బాటపట్టి అడవిలో పరుగులు తీస్తుంటే, పోలీస్ బలగాలు వెంటాడి కాల్చి చంపారు.

60 మందికి పైగా కాల్పుల్లో ఊపిరి కోల్పోయారు! 


ఈ కాల్పుల్లో 60 మందికి పైగా ఆదివాసీలు మరణించగా 30 మందికి పైగా గాయపడ్డారు. దీన్ని దేశంలోనే అప్పట్లో ఆదివాసుల పైన జరిగిన ప్రభుత్వం దాష్టికం గా పేర్కొనవచ్చు. జలియన్ వాలా బాగ్ లో జరిగిన సంఘటన ను తలపించేది గా పేర్కొనవచ్చు. అంతకు ముందు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని మందమర్రి లో సీపీఐ నాయకులు వీటి అబ్రహం, ఎండీ. మునీర్ తదితరుల మీద భూస్వామి గూండాల దాడి, హత్యాప్రయత్నం కు నిరసనగా జనవరి 6, 1979 లో బొగ్గు గని కార్మికులు  విధులు బహిష్కరించి భారీ ర్యాలీ నిర్వహించారు. ఎలాంటి హెచ్చరిక లేకుండా పోలీసులు కాల్పులు జరుపగా అక్కడికక్కడే నలుగురు, ఆ తర్వాత ఇద్దరు మొత్తం ఆరుగురు కార్మికులు తూటాలకు బలయ్యారు.18 మంది కి పైగా గాయపడ్డారు.సీపీఐ మాజీ ఎమ్మెల్యే, దివంగత గుండా మల్లేష్ ఈ కాల్పుల సంఘటనలో తృటిలో తప్పించుకున్నారు.

ఈ సంఘటన అనంతరం 1981 లో ఇంద్రవెల్లి సంఘటన ఇదే జిల్లాలో జరిగింది. దేవాపూర్ లోని మద్దిమాడ వద్ద కూడ ఆదివాసీల మీద జరిగిన కాల్పుల్లో ఒకరు మరణించగా, పలువురు గాయపడ్డారు. ఆదివాసీలు తమ హక్కుల కోసం, జల్, జమిన్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇంకా వారి జీవితాల్లో మార్పు రాలేదు. ఖనిజాల కోసం అడవుల నరికి వేత, వారి గ్రామాల నుంచి సోకాల్డ్ అభివృద్ధి పేరిట తరిమి వేస్తున్నారు. అటవి శాఖ తో ఇంకా వివాదాలు, పోడు వ్యవ సాయం మీద ఉక్కు పాదం కొనసాగుతూనే ఉన్నది. కనీస సౌకర్యాలకు నోచని జీవితాలు, ఎక్కడ వేసిన గొంగళి, అక్కడే చందం లాంటి గ్రామాలు ఉన్నాయి. తమ హక్కుల మీద అణిచివేతలు, సంపద లో భాగస్వామ్యం కూడ లేదు. ప్రభుత్వం ఆదివాసీల కోసం తెస్తున్న పథకాలు కూడ అమలు సరిగా కాకపోవడం, వైద్యం, విద్య, ఉపాధి లాంటివి వారికి అందక పోవడం మీద ప్రభుత్వం దృష్టి పెట్టాలి!

 తొలి నివాళి ఆతనిదే!  

1981 ఏప్రిల్ 20న ఇంద్రవెల్లిలో జరిగిన పోలీసు కాల్పుల్లో వందలాది మంది గిరిజనులు చనిపోవడంతో వారి జ్ఞాపకార్ధం ఇంద్రవెల్లిలో నిర్మించిన అమర వీరుల స్తూపానికి యేటా ఏప్రిల్ 20న మొదట నివాళులు సిడాం శంభుతో పాటు కుమ్ర ఈశ్వరి బాయిలు నిర్వహించే వారు. మావోయిస్టులపై ప్రభుత్వం నిషేధం విధించిన సమయంలో పోలీసులు అడ్డుకొనే ప్రయత్నాలు చేసినప్పటికి అమరవీరుల స్తూపం వద్దకు చేరుకొని నివాళులు అర్పించే వారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నివాళులు ఆర్పించడానికి అవకాశం కల్పించడంతో గిరిజనులు ఇంద్రవెల్లి మృతుల వీరుల పోరాట కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పిస్తున్నారు. జల్, జంగల్, జమీన్ కోసం పోరాటాలు చేసి అమరుడైన కుమ్రం భీం ఆశయ సాధన కోసం కెరమెరి మండలం జోడేఘాట్ లో జరిగే కార్యక్రమాన్ని శంభు నిర్వ హిస్తూ ఆదివాసీ గిరిజనుల సమస్యలను ప్రభుత్వానికి తెలియజేయడంలో ముందుండే వారు. సీడాం శంభు 2018 జూలై 19 నాడు అనారోగ్యంతో రాత్రి చివరి శ్వాస వదిలాడు.

 

స్మారక స్థూపం ఏర్పాటు


రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో ఇంద్రవెల్లిలో అమరుల స్మారక స్థూపాన్ని నిర్మించారు. 1986 మార్చి 19న గుర్తు తెలియని వ్యక్తులు ఈ స్థూపాన్ని పేల్చేశారు. ప్రజా సంఘాల ఒత్తిళ్లు, ఆదివాసుల పోరాట ఫలితంగా 1987లో సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ ఉట్నూర్ నిధులతో తిరిగి స్థూపాన్ని కట్టారు. ఇంద్రవెల్లి కాల్పుల్లో అసువులు బాసిన ఆదివాసీ బిడ్డలకు నివాళులు! 

-ఎండీ మునీర్, సీనియర్ జర్నలిస్ట్, సామాజిక , రాజకీయ,విశ్లేషకులు,9951865223,

Advertisment
Advertisment
తాజా కథనాలు