ఏం చేస్తున్నారో అర్థం అవుతోందా?: మంత్రులు, నేతలకు సీఎం రేవంత్ వార్నింగ్!

పార్టీ అంతర్గత విషయాలను కొందరు మీడియా ఎదుట మాట్లాడడంపై సీఎం రేవంత్ సీరియస్ అయ్యారు. మంత్రులు క్షేత్ర స్థాయిలో సమన్వయంతో పని చేయడం లేదని ఫైర్ అయ్యారు. ఈ రోజు జరిగిన TPCC పీఏసీ మీటింగ్ లో రేవంత్ పార్టీ నేతలకు పలు అంశాలపై క్లాస్ తీసుకున్నట్లు తెలుస్తోంది.

New Update

వర్గవిభేదాలు పక్కన పెట్టి, పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేయాలని సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, నేతలకు స్పష్టం చేశారు. నేడు జరిగిన పీఏసీ మీటింగ్ లో మంత్రుల పనితీరుపై సీఎం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కొందరు ఎమ్మెల్యేలపై కూడా రేవంత్ ఫైర్ అయినట్లు సమాచారం. అంతర్గతంగా మాట్లాడుకోవాల్సిన పార్టీ విషయాలను ప్రెస్ మీట్లు పెట్టి, సభల్లో మాట్లాడడం ఏంటని ఆయన ఫైర్ అయ్యారు. గొడవలతో పార్టీకి నష్టం చేస్తామంటే ఊరుకోనని వార్నింగ్ ఇచ్చినట్లు సమాచారం. పార్టీకి వ్యతిరేకంగా ర్యాలీలు, ధర్నాలు చేస్తే బాగుండదని తేల్చిచెప్పినట్లు పార్టీ వర్గాల్లో్ చర్చ సాగుతోంది. రానున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ ఖచ్చితంగా గెలవాల్సిందేనని స్పష్టం చేసినట్లు సమాచారం. పొన్నం ప్రభాకర్ సారథ్యంలో హైదరాబాద్ జిల్లా నేతలు ఇందు కోసం పని చేయాలని చెప్పినట్లు తెలుస్తోంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు