బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 2కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. బీఆర్ఎస్ తరఫున లాయర్లు ఈ రోజు రెండు గంటల పాటు సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఏప్రిల్ 2న స్పీకర్,అసెంబ్లీ సెక్రటరీ తరఫున న్యాయవాదులు వాదనలు వినిపించనున్నారు. అనంతరం న్యాయస్థానం తీర్పును వెల్లడించే అవకాశం ఉంది. వాస్తవానికి ఈ రోజే తీర్పు వస్తుందన్న చర్చ జరిగింది. దీంతో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన పది మంది ఎమ్మెల్యేల్లో హైటెన్షన్ నెలకొంది. విచారణను వాయిదా వేయడంతో.. తర్వాత ఏం జరగబోతుందనే అంశంపై వారు న్యాయవాదులతో చర్చలు జరుపుతున్నారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్.. సుప్రీంకోర్టులో బిగ్ ట్విస్ట్!
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణను ఏప్రిల్ 2కు సుప్రీంకోర్టు వాయిదా వేసింది. Short News | Latest News In Telugu | తెలంగాణ
New Update
తాజా కథనాలు