MLA KTR: ఆ స్కామ్ డబ్బులే కాంగ్రెస్ నేతలు ఎన్నికల్లో పంచారు: కేటీఆర్

వాల్మీకి స్కామ్‌పై కేటీఆర్ సంచలన ట్వీట్ చేశారు. గతంలో తాము చెప్పినట్టుగానే వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు.

MLA KTR
New Update

MLA KTR: కర్ణాటక రాజకీయాల్లో సంచలనం సృష్టించిన వాల్మీకి స్కామ్ పై మాజీ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. మేమన్నదే నిజమైందని అన్నారు. వాల్మీకీ స్కామ్‌ పైసలే తెలంగాణ కాంగ్రెస్ మొన్న లోక్‌సభ ఎన్నికల్లో వాడిందని ఆరోపించారు. గిరిజనుల బాగుకోసం ఖర్చు చేయాల్సిన సొమ్మును ఎన్నికల ప్రచారం కోసం వాడుకున్న కాంగ్రెస్ నేతలను శిక్షించాలని డిమాండ్ చేశారు. వాల్మీకి కుంభకోణంలో కాంగ్రెస్‌ నేత, కర్ణాటక మాజీ మంత్రి బీ నాగేంద్రనే కీలక సూత్రధారి అని ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) తన చార్జిషీట్‌లో నిర్ధారించిందని తెలిపారు. 

రూ.187 కోట్లు...

కర్ణాటక మహర్షి వాల్మీకి షెడ్యూల్డ్‌ ట్రైబ్స్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌’కు చెందిన రూ.187 కోట్లు ఏకంగా కాంగ్రెస్ మంత్రి చేతులమీదుగా దారిమళ్లాయని అన్నారు. ఆ సొమ్ము తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మొన్న లోక్‌సభ ఎన్నికల ఫండింగ్ కోసం ఉపయోగించిందని ఆరోపించారు. వాల్మీకి స్కామ్‌లో ప్రధాన నిందితుడు సత్యనారాయణ వర్మ హైదరాబాద్‌కు చెందిన బిల్డర్‌ అని పేర్కొన్నారు.

తెలంగాణకు చెందిన ఇద్దరు కీలక కాంగ్రెస్‌ నేతలకు సత్యనారాయణ వర్మ అత్యంత సన్నిహితుడని అన్నారు. ఇతనికి సంబంధించిన వ్యాపారంలోనూ ఇక్కడి కాంగ్రెస్‌ నేతలు భాగస్వాములుగా ఉన్నట్టు అనుమానాలు ఉన్నాయని చెప్పారు. ఇంకా చాలామంది కాంగ్రెస్ పెద్దలు ఉన్నారు అనేది నిర్వివాదం అని పేర్కొన్నారు. దర్యాప్తు సంస్థలు వాల్మీకీ స్కామ్‌ నిజాలు నిగ్గుతేల్చాలని.. దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

 

#brs-mla-ktr
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe