రేపు గాంధీ భవన్ ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల

TG: రేపు గాంధీ భవన్ మంత్రులతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు హాజరుకానున్నారు. ఉదయం 11 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని మహేష్ గౌడ్ కోరారు.

New Update
Thummala Nageswara Rao: రూటు మార్చుతున్న తుమ్మల..త్వరలో సంచలన నిర్ణయం!!

Minister Thummala Nageshwar Rao: టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గాంధీ భవన్ లో మంత్రులతో ముఖాముఖి కార్యక్రమంలో రేపు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పాల్గొననున్నారు. షెడ్యూల్ ప్రకారం శుక్రవారం నాడు జరగాల్సిన మంత్రులతో ముఖాముఖి కార్యక్రమం టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ తన సొంత జిల్లా నిజామాబాద్ లో పర్యటించడంతో వాయిదా పడిన విషయం తెలిసిందే. 

అనుకున్న షెడ్యూల్ లో మార్పు..

కాగా ముందుగానే ప్రకటించినట్టుగా సోమవారం నాడు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. కాగా ఇప్పటికే మొదటి రోజు వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజా నర్సింహ, రెండో రోజు నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఇదిలా ఉండగా సోమవారం నాడు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావ్ పాల్గొనే ఈ కార్యక్రమంలో ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు భారీగా పాల్గొని సమస్యలు పరిష్కరించుకోవాలని టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు