BIG Breaking : గ్రూప్-1 నియామకాలకు బ్రేక్..  TGPSCకి హైకోర్టు బిగ్ షాక్..

గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దని,  సర్టిఫికెట్ వెరిఫికేషన్ కొనసాగించవచ్చని టీజీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది.  

New Update
High Court

గ్రూప్-1 నియామకాలను తాత్కాలికంగా నిలిపివేయాలని టీజీపీఎస్సీని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. విచారణ పూర్తయ్యే వరకు నియామక పత్రాలు ఇవ్వొద్దన్న న్యాయస్థానం సర్టిఫికెట్ వెరిఫికేషన్ మాత్రం కొనసాగించవచ్చని స్పష్టం చేసింది. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని హైకోర్టులో 20 పిటిషన్లు దాఖలు అయ్యాయి. విచారణ పూర్తయ్యే వరకు గ్రూప్-1 నియామక పత్రాలు ఇవ్వొద్దంది హైకోర్టు.

సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలు 

కాగా గ్రూప్-1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీలను ఇప్పటికే టీజీపీఎస్‌సీ ప్రకటించింది. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు తమ సర్టిఫికెట్లను 2025 ఏప్రిల్ 16, 17, 19, 21 తేదీల్లో వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ జరుగుతుంది.  ఎంపికైన అభ్యర్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావాల్సి ఉంటుంది.  

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు