/rtv/media/media_files/2024/10/24/xkn9ITCW8c5RUrGndqTH.jpg)
Current Bills Hike: తెలంగాణలో సామాన్యులకు షాక్ అంటూ త్వరలో కరెంట్ ఛార్జీలను రేవంత్ సర్కార్ పెంచబోతుందంటూ జరుగుతున్న ప్రచారంపై డిస్కం సీఎండీ ముషారఫ్ స్పందించారు. రాష్ట్రంలో సామాన్యులపై కరెంట్ ఛార్జీలు పెంచబోమని తేల్చి చెప్పారు. అవన్నీ తప్పుడు ప్రచారాలు అంటూ కొట్టి పారేశారు. హైటెన్షన్ ఇండస్ట్రియల్ వినియోగదారులపై కూడా ఛార్జీల భారం పడదని అన్నారు. నెలకు 300 యూనిట్లకు పైగా వినియోగదారులకు ఫిక్స్డ్ ఛార్జీల రూపంలో రూ.50 పెంపు కోసం రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదించామని చెప్పారు.