/rtv/media/media_files/SDLbkMZzqimrKSxlFDWW.jpg)
TPCC President Mahesh Goud
TPCC President Mahesh Goud : తెలంగాణలో మరోసారి వచ్చేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, మరో పదేళ్లు కాంగ్రెస్ ప్రభుత్వానికి ఢోకా లేదని టీపీసీసీ ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు.గాంధీ భవన్ లో టీపీసీసీ అధ్యక్షులు ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మీడియా తో చిట్ చాట్ గా మాట్లాడాడు. మంత్రులతో పాటు ఇంచార్జ్ బాధ్యతలు ఉన్న ప్రతీ ఒక్కరూ బాగా పని చేయడం వల్లే జూబ్లీహిల్స్ లో గెలవబోతున్నామన్నారు. పోలింగ్ పర్సంటెజ్ పెరిగి ఉండాల్సింది. పట్టణ ప్రజలు, యువత ముందుకు వచ్చి ఓటువేయాలి. రిగ్గింగ్ చేయడం పాజిబుల్ కాదు. ఇది పాత జమానా కాదు. ఓడిపోతున్నామనే బాధతో BRS వాళ్లు మాట్లాడుతున్నారన్నారు.దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం. జూబ్లీహిల్స్ లో మా పార్టీ అభ్యర్థి కూడా ప్లస్ పాయింట్ గా మారింది.ప్రస్తుతం తెలంగాణ లో పాజిటివ్ వేవ్ కనిపిస్తుంది. మళ్లీ వచ్చేది కూడా కాంగ్రెస్ ప్రభుత్వమేనని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
లోకల్ బాడీ ఎన్నికలు కూడా త్వరలో జరగనున్నాయని హైకోర్టు ఆదేశాల మేరకు ముందుకు వెళ్తామన్నారు. మరో సారి ఏఐసీసీ తో మాట్లాడి.. లోకల్ బాడీ ఎన్నికలకు వెళ్తామన్నారు. లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహించాలి. రెండు, మూడు రోజుల్లో అందరం కూర్చొని మాట్లాడి ముందుకు వెళ్తా మన్నారు.బీసీ లకు 42 శాతం చట్టబద్ధకంగా చేయాలని అనుకున్నాం. కానీ కేంద్రం లోని బీజేపీ అడుగడుగునా అడ్డం పడుతుందని ఆరోపించారు.క్యాబినెట్ విస్తరణ సీఎం, పార్టీ అధిష్టానం చూసుకుంటుందన్నారు.ఏ ఎన్నికలైనా సరే గెలుపు కాంగ్రెస్ పార్టీదేనన్నారు. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందని పార్టీ కార్యకర్తలు ధీమాతో చెబుతున్నారు.
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ తపన. బీసీలు బాగుపడొద్దు అన్న వైఖరితో బండి సంజయ్,కిషన్ రెడ్డి అడ్డుపడుతున్నారు. డీసీసీ అధ్యక్షుల ప్రకటన ఏ క్షణమైన రావొచ్చు. సోషల్ మీడియా ఫేక్ ప్రచారం టెంపరరీ గేమ్ మాత్రమే. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల్లో పెయిడ్ యూట్యూబ్ చానల్స్ ద్వారా ఫేక్ సర్వేలకు బీఆర్ఎస్ పూనుకుందని అరోపించారు.
నాకు పదవి కావలని ఏ రోజు అడిగింది లేదు.పీసీసీ అధ్యక్షుడిగా కాంగ్రెస్ ప్రభుత్వం మరోసారి రావాలని కోరిక అన్నారు.మరోసారి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసి సోనియా గాంధీ గారికి గిఫ్ట్ ఇవ్వాలని కోరిక అన్నారు.బీహార్ లో మహాఘాట్ బంధన్ గెలుస్తుందని నమ్మకం ఉందన్నారు. త్వరలో ఓట్ చోరీ పై కమిటీ వేస్తామన్నారు.ఓట్ చోరీ ని అధిగమించి గెలవాలన్నదే కాంగ్రెస్ పార్టీ తాపత్రయమన్నారు. కాంగ్రెస్ పార్టీకి డొఖా లేదు, క్యాబినెట్ విస్తరణ అనేది ఏఐసీసీ , సీఎం రేవంత్ రెడ్డి కలిసి తీసుకునే నిర్ణయం. నాకు డిప్యూటీ సీఎం అని పేపర్లో వచ్చినట్టు విన్నా నేను పేపర్లో చూసా.రేవంత్ సీఎం గా డిప్యూటీ సీఎం బట్టిగా నేను పీసీసీ గానే ఉంటామని మహేష్ గౌడ్ స్పష్టం చేశారు.
Follow Us